సంచలనం: మహిళపై 23మంది గ్యాంగ్ రేప్, రాత్రంతా ఆమెకు నరకం..
ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఓ మహిళపై రాజస్థాన్ బికనీర్లో జరిగిన సామూహిక అత్యాచారం సంచలనం రేపుతోంది.
జైపూర్: ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఓ మహిళపై రాజస్థాన్ బికనీర్లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏకంగా 23మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బికనీర్ లోని తనకున్న స్థలాన్ని చూసేందుకు వెళ్లిన మహిళ.. తిరుగు ప్రయాణంలో అత్యాచారానికి గురైంది. వెహికిల్ కోసం వేచి చూస్తుండగా.. ఓ వాహనంలో వచ్చిన అగంతకులు ఆమెను బలవంతంగా లోపలికి లాగారు.
సెప్టెంబర్ 25న:
బాధితురాలు సెప్టెంబర్ 25న బికనీర్ లోని రిడ్మల్సర్ పురోహిటన్ ప్రాంతంలో తనకున్న స్థలాన్ని చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెహికిల్ కోసం జైపుర్రోడ్డులో ఖటూశ్యాంమందిర్ సమీపం వద్ద ఆగారు. ఇంతలో ఎస్యూవీ కారులో వచ్చిన ఇద్దరు అగంతకులు ఆమెను బలవంతంగా లోపలికి లాగారు.
కారులోనే రేప్:
తనను బలవంతంగా లోపలికి లాగిన తర్వాత.. కారును సమీపంలోని గనుల వైపు తీసుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. అలా కదులుతున్న కారులోనే తనపై అత్యాచారం జరిపారని పేర్కొంది. ఆ ఇద్దరు మరో మరో ఆరుగురిని పిలిపించారనీ, వారు కూడా తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది.
అక్కడ మరికొంతమంది:
కారులో తనపై అత్యాచారం చేస్తూనే పలన అనే గ్రామానికి తీసుకెళ్లారని, ఆ ఊరిలోని విద్యుత్తు సబ్స్టేషన్ వద్ద మరికొంతమంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. రాత్రంతా తనపై అత్యాచారం జరిపిన దుండగులు.. మరుసటి రోజు తెల్లవారుజామున 4గం.కు ఎక్కడినుంచైతే ఎత్తుకెళ్లారో అక్కడే వదిలిపెట్టారని ఆమె తెలిపింది.
కండోమ్లు స్వాధీనం:
మహిళ ఫిర్యాదుతో 21మంది గుర్తుతెలియని అనుమానితులపై 27న పోలీసులుకేసు నమోదుచేశారు. ఘటనాస్థలిలో కండోమ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజేంద్రసింగ్ తెలిపారు.బాధితురాలు మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారనీ, ఎఫ్ఐఆర్లో చెప్పిన వివరాలే అక్కడ కూడా చెప్పారని అన్నారు. రాజు, సుభాష్ అనే ఇద్దరు అనుమానితులను గుర్తించామనీ, మహిళ వైద్యపరీక్ష నివేదికకోసం వేచిచూస్తున్నామని చెప్పారు. కేసుకు సంబంధించి ఇప్పటిరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.