పెద్ద నోట్ల రద్దు: మోడీని ప్రశ్నించనున్న పీఏసీ?
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ కారణం చేత నోట్ల రద్దును చేపట్టారని తెలుసుకునేందుకు ప్రధానికి సమన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు పార్లమెంటరీ కమిటీ చీఫ్ వీకే థామస్ అభిప్రాయపడ్డారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో వెల్లడించేందుకు తమను కలవాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఫైనాన్స్ సెక్రటరీ అశోక్ లావాస, ఎకనామిక ఎఫైర్ సెక్రటరీ శక్తికాంత దాస్లను ఆదివారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆదేశించింది. జనవరి 20వ తేదీలోపు నోట్ల రద్దుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది.

ఆ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కలిగిన ప్రభావాన్ని వివరించాలని స్పష్టం చేసింది. గత నవంబర్ 8న రూ.500, 1000నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే నోట్ల రద్దు అంశంపై ఎవరినైనా ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉందని థామస్ తెలిపారు. కానీ, జనవరి 20న ఉర్జిత్ పటేల్ అశోక్, శక్తికాంతదాస్లతో జరిగే సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ పీఏసీ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయిస్తే.. తాము ప్రధానిని కూడా నోట్ల రద్దు అంశంపై విచారిస్తామని థామస్ తెలిపారు. అంతేగాక, ప్రధాని తన అహంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications