Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనాకు చెక్ పెట్టిన భారత్..!!

India China border disputes: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. శాంతియుత వాతావరణం నెలకొనడానికి భారత్ చేపట్టిన చర్చలు ఫలించాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతున్న యుద్ధ వాతావరణం చల్లారినట్టే కనిపిస్తోంది.

లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్ బాబు అమరుడయ్యారు.

Disengagement of troops of India and China has started in Eastern Ladakh sector

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సరిహద్దు వెంబడి రెండు వైపులా వేలాదిమంది సైనికులు మోహరించారు. పాంగ్యాంగ్ త్సో సరస్సు, గాల్వన్ వ్యాలీ, డెప్సాంగ్, డెమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో సైనికులు యుద్ధానికి సిద్ధం అయ్యారు.

సుమారు 40 వేల మంది వరకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు అక్కడ మొన్నటివరకూ మోహరించే ఉన్నారు. ఈ విషయంలో భారత్ కూడా వెనకడుగు వేయలేదు. ప్యాంగ్యాంగ్ త్సొ, గాల్వన్ వ్యాలీ, కైలాష్ రేంజ్, గోప్రా పీపీ 17ఏ, గోప్రా పీపీ 15, గోగ్రా హాట్ స్ప్రింగ్ ప్రాంతానికి సైన్యాన్ని మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రినీ తరలించింది.

ఆ తరువాత రెండు దేశాల మధ్య ఆర్మీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు ఏర్పాటయ్యాయి. అనేక దఫాలుగా సాగాయి. సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకోవాలనే సింగిల్ అజెండా కింద చర్చలను నిర్వహించారు. బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ వద్ద సుదీర్ఘంగా కొనసాగాయి.

Disengagement of troops of India and China has started in Eastern Ladakh sector

ఉద్రిక్తతను చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాధికారులు అప్పట్లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పరస్పర అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ముందడుగు వేశారు. మూడుదశల్లో బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికి రెండుదేశాల సైన్యాధికారుల మధ్య అంగీకారం కుదిరింది.

దానికి అనుగుణంగా సైనిక తరలింపు ఆరంభమైంది. ఇదివరకు గాల్వన్ లోయ, ఆ తరువాత చెక్ పోస్టుల వద్ద నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకున్నాయి భారత్, చైనా. మూడో విడతగా ఇప్పుడు తాజాగా డెస్పాంగ్ ప్లెయిన్, డెమ్‌చోక్ నుంచి సైనికుల తరలింపు మొదలైంది. యుద్ధ సామాగ్రిని సైతం అక్కడి నుంచి వెనక్కి రప్పిస్తోంది.

2020 జూన్‌కు ముందు నాటి సాధారణ పరిస్థితులు ఇప్పుడక్కడ క్రమంగా నెలకొంటోన్నాయి. సైనిక తరలింపు కార్యక్రమాన్ని చైనా విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ధృవీకరించారు. రెండు దేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల మేర తమ జవాన్లను వెనక్కి పిలిపించుకుంటోన్నామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+