ప్రియుడిని ఉరివేసిన ప్రియురాలి ఫ్యామిలీ: విషం ఇచ్చి..

ఎస్పీ ప్రబల్ ప్రతాప్ సింగ్ కథనం ప్రకారం.. భర్తల్ గ్రామానికి చెందిన మఖాన్ సింగ్ 15ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె, రాకేష్ సింగ్ అనే యువకుడు(17) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఏకాంతంగా ఉండగా.. అమ్మాయి తండ్రి మఖాన్ సింగ్, అతని నలుగురు కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమిద్లకు తమ ఇంట్లో కనిపించారు.
తమ అమ్మాయి పరాయి వ్యక్తితో కనబడటంతో వాళ్లందరూ ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఆవేశంలోనే మఖాన్ సింగ్, తన కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమిద్లతో కలిసి బలవంతంగా అమ్మాయికి విషం తాగించారు. ఆ తర్వాత రాకేష్ సింగ్ను తీవ్రంగా కొట్టి, ఉరివేసి చంపారు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఆ ఇంటి నుంచి వచ్చిన అరుపులు విని అక్కడి చేరుకున్న గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకునే సరికే అబ్బాయి మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న అమ్మాయిని ఆస్పత్రికి తరలిచారు. ఆమె పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, రాకేస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడు రాకేష్ తండ్రి.. తన కుమారుడిని నిందితులు ఇనుప రాడ్తో కొట్టి, తర్వాత ఉరేసి చంపారని ఆరోపించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగపడిన తర్వాత ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని, నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications