కొడుకు వేధింపులు: మర్మాంగాన్ని కోసుకున్న తండ్రి
బెంగళూరు: మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రవర్తన భరించలేక ఓ తండ్రి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా జట్టి అగ్రహార గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జట్టి అగ్రహార గ్రామానికి చెందిన సంజీవరాయప్ప(69) భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది. కాగా, తన నివాసంలోనే కుమారుడు నాగరాజుతో కలిసి ఉంటున్నాడు సంజీవరాయప్ప. అయితే, మద్యానికి బానిసైన నాగరాజు తరచూ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేసేవాడు.

దీంతో అతని కుమారుడు, భార్య కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్లిపోయారు. వృద్ధాప్యం కారణంగా మంచానికే పరిమితమైన సంజీవరాయప్ప.. కుమారుడి వేధింపులు భరించలేకపోయాడు. తరచూ మద్యం తాగి వచ్చి రాయప్పను దుర్భాషలాడటంతపాటు అందిన వస్తువుతో కొట్టేవాడు నాగరాజు.
శుక్రవారం రాత్రి కూడా నాగరాజు తన తండ్రి రాయప్పను తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సంజీవరాయప్ప.. శనివారం ఉదయం కుమారుడు బయటికి వెళ్లగానే కత్తితో మర్మాంగాన్ని కోసుకున్నాడు. బాధ భరించలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు ఆస్పత్రిలో చేర్పించారు.
కొరటిగెర ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రాయప్ప. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications