జయలలిత బంపరాఫర్: నెలకు 10రోజులు బస్సుల్లో ఫ్రీ
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడులో వృద్ధులకు మంచి ఆఫర్ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు నెలకు పది రోజుల పాటు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
తద్వారా తమిళనాడులో సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. చెన్నై సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ సౌకర్యం వర్తించనుందని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. తొలివిడతగా ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుందని చెప్పారు.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో ఎప్పుడైనా పదిరోజుల పాటు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని, డెడ్ లైన్ లేదని జయలలిత వెల్లడించారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు బస్సు డిపోలలోను, ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ ద్వారా తీసుకోవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications