సీఏఏ నిరసన: దేశం విడిచి వెళ్లాంటూ జర్మనీ విద్యార్థికి ఆదేశాలు
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో మద్రాసు యూనివర్సిటీలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు జర్మనీకి చెందిన విద్యార్థిని అధికారులు దేశం విడిచివెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
జాకబ్ లిన్డెన్తాల్ అనే విద్యార్థి స్టూడెంట్ ఎక్చ్సేంచ్ ప్రోగ్రాం కింద ఐఐటీ మద్రాసులో భౌతికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్నాడు. గత వారం సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో జాకబ్ పాల్గొన్నాడు. '1933-1945 వరకు మేము ఇక్కడే ఉన్నాం', యూనిఫాం వేసుకున్న నేరస్తులు=నేరస్తులే' అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించాడు.

ఈ ఫొటోలు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో జాకబ్ను విచారించి, వీసా నిబంధనలను అతిక్రమించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అతడ్ని వెంటనే భారతదేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అతను సోమవారం రాత్రి జర్మనీకి బయలుదేరినట్లు సమాచారం.
అర్ధాంతరంగా సెమిస్టర్ మధ్యలో విద్యార్థిని దేశం నుంచి పంపడాన్ని ఐఐటీ మద్రాసు విద్యార్థులు తప్పుబట్టారు. దీనిపై ఐఐటీ అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, అధికారుల తీరును రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.
మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంతంగా ఉండాలి. ఏ ప్రజాస్వామ్యం భావ ప్రకటనా స్వేచ్ఛను శిక్షించదు. విద్యార్థి బహిష్కరణను ఉపసంహరించుకునేలా ఐఐటీ మద్రాసు వారిని ఆదేశించమని కోరుతున్నాను. విద్యారంగంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ను ట్యాగ్ చేశారు. ఆయన దీనిపై స్పందించాల్సివుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications