జిగేల్ జిగేల్: తవ్వకాల్లో గుట్టలుగా బయటపడ్డ బంగారం
తమిళనాడులోని మదురైకి సమీపంలో ఉన్న కీలడి ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బంగారు బయటపడింది. తొలి మూడువిడతల్లో జరిగిన తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడ్డాయి. రెండో విడత తవ్వకాల తర్వాత భారత పురావస్తు శాఖ కాకుండా రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలని పలు తమిళ సంఘాలు డిమాండ్ చేశాయి. భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే తమిళ చరిత్ర గురించి బయట ప్రపంచానికి చెప్పవని తమిళ సంఘాలు ఆరోపించాయి. దీంతో రాష్ట్ర పురావస్తు శాఖతో కలిసి భారత పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.55 లక్షలు కూడా విడుదల చేసింది.

చంద్రన్ అనే వ్యక్తికి సంబంధించి 1.5 ఎకరాల్లో తవ్వకాలు జరపగా పలు వస్తువులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఏమైనా వస్తువులు బయటపడే అవకాశం ఉండటంతో కార్తీక్ అనే మరో వ్యక్తి భూమిలో తవ్వకాలు జరపగా అందులో గుట్టలు గుట్టలుగా బంగారం బయటపడటంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. బంగారంతో పాటు ఆకాలం నాటి ఇటుకలతో చేసిన పొయ్యిలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు బయటపడ్డాయి. దొరికిన బంగారాన్ని పరీక్షించేందుకు వేరే గ్రామానికి తరలించారు.

సెప్టెంబర్ వరకు తవ్వకాలు జరిపితే మరింత బంగారంతో పాటు మరిన్ని పురాతన వస్తువులు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు తవ్వకాలకు అడ్డంకిగా మారాయి.

-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications