వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిగేల్ జిగేల్: తవ్వకాల్లో గుట్టలుగా బయటపడ్డ బంగారం

|
Google Oneindia TeluguNews

తమిళనాడులోని మదురైకి సమీపంలో ఉన్న కీలడి ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బంగారు బయటపడింది. తొలి మూడువిడతల్లో జరిగిన తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడ్డాయి. రెండో విడత తవ్వకాల తర్వాత భారత పురావస్తు శాఖ కాకుండా రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలని పలు తమిళ సంఘాలు డిమాండ్ చేశాయి. భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే తమిళ చరిత్ర గురించి బయట ప్రపంచానికి చెప్పవని తమిళ సంఘాలు ఆరోపించాయి. దీంతో రాష్ట్ర పురావస్తు శాఖతో కలిసి భారత పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.55 లక్షలు కూడా విడుదల చేసింది.

Gold unearthed in Keezhadi site excavations

చంద్రన్ అనే వ్యక్తికి సంబంధించి 1.5 ఎకరాల్లో తవ్వకాలు జరపగా పలు వస్తువులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఏమైనా వస్తువులు బయటపడే అవకాశం ఉండటంతో కార్తీక్ అనే మరో వ్యక్తి భూమిలో తవ్వకాలు జరపగా అందులో గుట్టలు గుట్టలుగా బంగారం బయటపడటంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. బంగారంతో పాటు ఆకాలం నాటి ఇటుకలతో చేసిన పొయ్యిలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు బయటపడ్డాయి. దొరికిన బంగారాన్ని పరీక్షించేందుకు వేరే గ్రామానికి తరలించారు.

Gold unearthed in Keezhadi site excavations

సెప్టెంబర్ వరకు తవ్వకాలు జరిపితే మరింత బంగారంతో పాటు మరిన్ని పురాతన వస్తువులు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు తవ్వకాలకు అడ్డంకిగా మారాయి.

Gold unearthed in Keezhadi site excavations
English summary
The had thrown up many surprises in the first three phases of excavation and so far more than 8,000 artefacts have been unearthed from the site.But for the first time, gold ornaments in large quantities were unearthed from two trenches in the first site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X