Sunder pichai: ఇల్లు అమ్ముకున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇల్లు అమ్ముకున్నాడు. పిచాయ్ తన పూర్వీకుల ఇంటిని తమిళ సినీ నటుడు, నిర్మాత సి మణికందన్ కు విక్రయించినట్లు హిందూ బిజినెస్ లైన్ వార్తా కథనం ప్రచురించింది.ఈ ఇల్లు తమిళనాడు రాజధాని చెన్నైలోని అశోక్ నగర్లో ఉంది. మిస్టర్ మణికందన్ ఇల్లు కొనుగోలు చేయడానికి వెతుకుతున్నాడు.
సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసిన వెంటనే ఇల్లు కొనాలని మణికందన్ నిర్ణయించుకున్నట్లు వార్తా సంస్థ నివేదించింది. "సుందర్ పిచాయ్ మన దేశం గర్వపడేలా చేశాడు. అతను నివసించిన ఇంటిని కొనుగోలు చేయడం నా జీవితంలో గర్వించదగిన విజయం" అని మణికందన్ అన్నారు.

స్వయంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన మణికందన్ తాను దాదాపు 300 ఇళ్లను నిర్మించి డెలివరీ చేశానని చెప్పారు. గూగుల్ సీఈఓ తల్లిదండ్రుల వినయం తనను కలిచివేసిందని మణికందన్ అన్నారు. "సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసి ఇచ్చింది. అతని తండ్రి మొదటి సమావేశంలోనే నాకు పత్రాలను అందించారు. వారి వినయం, వినయపూర్వకమైన విధానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను" అని మణికందన్ పేర్కొన్నాడు.
"వాస్తవానికి అతని తండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉండి, నాకు పత్రాలు ఇవ్వడానికి ముందు అవసరమైన అన్ని పన్నులు చెల్లించాడు" అని అతను చెప్పాడు. సుందర్ పిచాయ్ చెన్నైలో పెరిగారు. పిచాయ్ IIT ఖరగ్పూర్లో 1989లో చేరారు. అక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. పిచాయ్ 20 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఇంటిలోనే ఉన్నాడు.
డిసెంబరులో గూగుల్ సీఈఓ చెన్నైకి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులకు నగదుతోపాటు కొన్ని గృహోపకరణాలను అందించారు. ఆయన బాల్కనీలో తన కుటుంబ సభ్యులతో ఫోటోలు కూడా తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications