పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన అంతర్జాతీయ సంస్థలు
న్యూఢిల్లీ: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది భారత ప్రభుత్వం. పలు అంతర్జాతీయ వేదికలపై వాతావరణం, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించింది. ఈ క్రమంలోనే చారిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా.. అంతర్జాతీయ సోలార్ సమాఖ్యకు నేతృత్వం వహించడంపై పలు అంతర్జాతీయ సంస్థలు భారత ప్రభుత్వాన్ని అభినందించాయి.
డిసెంబర్ 2015లో చారిత్రాత్మక పారిస్ ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది. కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు కారణమవుతున్న వాటిని అణిచివేయాలనేది ప్రధాన అంశంగా ఈ ఒప్పందంలో ఉన్నాయి. కార్బన్ కారకాలను అణిచివేయడం ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగకుండా నియంత్రించాలనే ఉద్దేశంతో భారత్ పనిచేస్తోంది. గాల్లోకి కార్బన్ ఉద్గారములు విడుదల చేసే దేశాల్లో భారత్ 6శాతం కార్బన్ ఉద్గారములు విడుదల చేస్తుండగా.. ఆ తర్వాత చైనా 28శాతం, అమెరికా 16 శాతం, యూరోపియన్ సమాఖ్య దేశాలు 10శాతంను గాల్లోకి కార్బన్ ఉద్గారములు విడుదల చేస్తున్నాయి.

ఫ్లోరా ఫౌనాల నుంచి సర్వేలా ఆధారంగా కృూర మృగాలను, అంతరించిపోతున్న పశుపక్ష్యాదులను కేంద్రప్రభుత్వం పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత పర్యావరణ మరియు అటవీశాఖ విధానాలు కార్యక్రమాల అమలు బీజేపీ ప్రభుత్వం చక్కగా నిర్వర్తిస్తోంది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మరియు వాతావరణశాఖలు చాలా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాన్ని పెంచడం, కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పర్యవేక్షించడం, 10లక్షల కోట్లు పెట్టుబడులు ఒకదశలో ఇరక్కపోయి ఉండగా వాటికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంలాంటివి చేసింది.అంతేకాదు 600 రోజుల్లో పూర్తికావాల్సిన ప్రాజెక్టు పనులను 190 రోజుల్లో కంప్లీట్ చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
అటవీప్రాంతంను పెంచుతున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. 2015 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం అటవీప్రాంతం మరియు వృక్ష సంపద 794, 254 చదరపు కిలోమీటర్లుగా తెలుస్తోంది.ఇది భారత భూవిస్తీర్ణంలో 24.16శాతంగా ఉంది. 2013 గణాంకాలతో పోలిస్తే అటవీప్రాంతం 3,775 చదరపు కిలోమీటర్లుకు పెరిగిందని కేంద్రం తెలిపింది. అటవీప్రాంతాల నుంచే 30శాతం వరకు ఇంధన కలపకోసం వినియోగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పశు పక్షాదులకు ఆహారం కూడా 40 శాతం అడవుల నుంచే వస్తోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications