బతికున్న భర్తకు 'డెత్ సర్టిఫికెట్'.. తర్వాతే అసలు ట్విస్ట్!!
ఈ రోజుల్లో కొంత మంది డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. సొంతవాళ్లను చంపడానికి కూడా తెగిస్తున్నారు. మరికొంత మంది అతితెలివితో బీమా డబ్బు కోసం బతికున్న వాళ్లను చనిపోయినట్లు నమ్మిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ జంట షాకింగ్ మోసానికి పాల్పడింది. బీమా కంపెనీని మోసం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. భర్త చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.25 లక్షలు కొట్టేయాలని ప్రయత్నించారు. రవి శంకర్ అనే వ్యక్తి చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించి.. భార్య కేశ్ కుమారి బీమా సొమ్ము రూ.25 లక్షలు క్లెయిమ్ చేయగా, అంతర్గత విచారణలో భర్త బతికే ఉన్నాడని తేలింది. ఈ మోసం వెలుగులోకి రావడంతో దంపతులను లక్నో పోలీసులు అరెస్టు చేశారు.
పక్కా ప్లాన్తో మోసం.. ఏం జరిగింది?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మోసం నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం ద్వారా ప్రారంభమైంది. 2012 డిసెంబర్లో రవి శంకర్కు అవివా ఇండియా బీమా కంపెనీ నుంచి రూ.25 లక్షల విలువైన పాలసీ జారీ అయింది. రవి శంకర్ భార్య, కేశ్ కుమారి, ఏప్రిల్ 21, 2023 నాడు బీమా కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకుంది. తన భర్త ఏప్రిల్ 9న మరణించినట్లు అందులో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జతపరిచింది. నకిలీ పత్రాలను నమ్మిన బీమా కంపెనీ క్లెయిమ్ను ఆమోదించి, ఏప్రిల్ 21 నాడు రూ.25 లక్షల మొత్తాన్ని కేశ్ కుమారి ఖాతాకు బదిలీ చేసింది.

మోసం ఎలా బయటపడిందంటే?
క్లెయిమ్ డబ్బు బదిలీ అయినప్పటికీ, బీమా కంపెనీలు అనుమానాస్పద క్లెయిమ్లపై సాధారణంగా చేసే అంతర్గత దర్యాప్తు ఈ మోసాన్ని బయటపెట్టింది. బీమా క్లెయిమ్కు గురైన రవి శంకర్ బతికే ఉన్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీనితో ఇది స్పష్టంగా మోసమని తేలడంతో, బీమా కంపెనీ ఫిర్యాదు దాఖలు చేసింది. అప్పటికే తమ మోసం బయటపడిందని గ్రహించిన రవి శంకర్, కేశ్ కుమారి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో తాము మోసానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. బీమా కంపెనీలను మోసం చేసేందుకు ప్రయత్నించడం తీవ్రమైన నేరం. ఈ జంటను పోలీసులు త్వరలో కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications