Illegal affair: భార్య ఫిజియో థెరపి డాక్టర్, మరదలు లేడీ టీచర్, ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడంటే, క్లైమాక్స్ లో !
బెంగళూరు/చామరాజనగర్: ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గా పని చేస్తున్న యువతిని పెళ్లి చేసుకోవాలని అతను అనుకున్నాడు. పెద్దలు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ వైజర్, లేడీ ఫిజియో థెరపిస్ట్ ల పెళ్లి జరిపించారు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న మరదలితో భర్త చాలా చనువుగా ఉంటున్నాడు. ఇదే సమమంలో చికిత్స చేసుకోవడానికి లేడీ ఫిజియో థెరపిస్ట్ దగ్గరకు మగాళ్లు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. నువ్వు కొందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని, అందుకే వాళ్లను రోగుల్లా నటించమని ముందే చెప్పి వారిని ఆసుపత్రికి పిలిపించుకుని వాళ్ల శరీరం ముట్టుకుని క్లోజ్ గా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నావని లేడీ ఫిజియో థెరఫిస్ట్ ను ఆమె భర్త టార్చర్ పెట్టాడు. భర్తతో పాటు అతని మరదలు కూడా లేడీ ఫిజియో థెరపిస్ట్ కు అక్రమ సంబంధం ఉందని టార్చర్ పెట్టడమే కాకుండా అందరికి ప్రచారం చేశారు. ఇంట్లో గొడవలు జరుగుతున్న సమయంలోనే లేడీ ఫిజియో థెరపిస్ట్ నదిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
లేడీ ఫిజియో థెరపిస్ట్ డాక్టర్
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని (మైసూరు పక్కన) యళందూరులో నాగవేణి (32) అనే మహిళ నివాసం ఉంటున్నారు, చామరాజనగర్ లోని జేఎస్ఎస్ ఆసుపత్రిలో నాగవేణి ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నది. నాగవేణికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సార్ సూపర్ వైజర్
చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్వామి నాయక్ అనే వ్యక్తి క్షయ రోగ విభాగంలో సూపర్ వైజర్ గా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. స్వామి నాయక్ కూడా పెళ్లి చేసుకోవాలని పెళ్లి సంబంధాలు చూశాడు. ఫిజియో థెరపిస్ట్ గా పని చేస్తున్న నాగవేణిని పెళ్లి పెళ్లి చూపుల్లో చూసిన స్వామి నాయక్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెద్దలు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ వైజర్ స్వామి నాయక్, లేడీ ఫిజియో థెరపిస్ట్ నాగవేణిల పెళ్లి జరిపించారు.
భర్త మరదలు ప్రభుత్వ స్కూల్ టీచర్
వివాహం చేసుకున్న నాగవేణి, స్వామి నాయక్ దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న మరదలు భాగ్యతో స్వామి నాయక్ చాలా చనువుగా ఉంటున్నాడు. ఇదే సమమంలో చికిత్స చేసుకోవడానికి లేడీ ఫిజియో థెరపిస్ట్ నాగవేణి దగ్గరకు మగాళ్లు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. నాగవేణి భర్త స్వామి నాయక్ మరదలు భాగ్యతో ఇక్కడ దంపతుల మద్య సమస్య మొదలైయ్యింది.
ఫిజియో థెరపిస్ట్ కు అక్రమ సంబంధం తగలగట్టి ?
నువ్వు కొందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని, అందుకే వాళ్లను రోగుల్లా నటించమని ముందే చెప్పి వారిని ఆసుపత్రికి పిలిపించుకుని వాళ్ల శరీరం ముట్టుకుని క్లోజ్ గా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నావని లేడీ ఫిజియో థెరఫిస్ట్ నాగవేణిని ఆమె భర్త స్వామి నాయక్ టార్చర్ పెట్టాడు. ఇదే విషయంలో నాగవేణి, స్వామి నాయక్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.
నదిలో శవమైన ఫిజియో థెరపిస్ట్
భర్త స్వామి నాయక్ తో పాటు అతని మరదలు భాగ్య కూడా లేడీ ఫిజియో థెరపిస్ట్ నాగవేణికి అక్రమ సంబంధం ఉందని టార్చర్ పెట్టడమే కాకుండా అందరికి ప్రచారం చేశారు. ఇంట్లో గొడవలు జరుగుతున్న సమయంలోనే మండ్య జిల్లాలోని బెళకవాడి ఏరియాలోని కావేరి నదిలో లేడీ ఫిజియో థెరపిస్ట్ నాగవేణి శవమై కనిపించడం కలకలం రేపింది. భర్త స్వామి నాయక్, అతని మరదలు భాగ్య టార్చర్ పెట్టడం వలనే ఫిజియో థెరపిస్ట్ నాగవేణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారని, ఇద్దరి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.