ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడిగింపు: ఆధార్-ప్యాన్ లింక్ కూడా
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్రం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. పన్ను రిటర్న్ దాఖలుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలుకు జులై 31 వరకు గడువు పొడిగించింది.
2019-20 ఐటీ రిటర్న్ దాఖలుకు నవంబర్ 30 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కూడా గడువును వచ్చే మార్చి వరకు పెంచింది. దీంతో అనుసంధానం చేయని వారికి మరో అవకాశం ఇచ్చినట్లయింది.

ఆధార్ కార్డును ప్యాన్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా ప్యాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని స్పష్టం చేసింది. ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా వీలుకాదని హెచ్చరించింది. అంతేకాదు ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఆర్ధిక లావాదేవీలు జరపలేరని కూడా తేల్చి చెప్పింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications