ఇక సువిధ వద్దు, ప్రయాణికులకు కేంద్రం స్పష్టీకరణ
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే విమానాల్లో మాస్క్ అవసరం లేదని పౌర విమానయాన సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సడలింపు చేశారు. అదే విదేశీ ప్రయాణికులు ఇకపై సువిధ పోర్టల్లో ఆన్ లైన్ ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. దాని నుంచి కేంద్ర ప్రభుత్వం వెసులబాటు కల్పించింది
విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్లో ఇదివరకు ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. అందులో ప్రయాణికులు కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారనే వివరాలు ఫాంలో పొందుపరిచాల్సి ఉంటుంది. తాజాగా ఆ నిబంధనను కేంద్రం సడలించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరం లేదు. ఆంక్షలు తొలగిస్తున్నామని పేర్కొంది.

ఇవాళ అర్ధరాత్రి నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగా, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించారు. కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసులో పేర్కొంది. ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications