ఆమె గొంతుకు దుప్పట్టా బిగించి ఈడ్చుకెళ్లారు: మహిళా ఖైదీ మృతిపై ఇంద్రానీ
కోర్టుకు హాజరైన ఇంద్రానీ మంజుల మృతిపై సాక్ష్యం చెప్పింది. తమ పక్క సెల్ లోనే ఉండే మంజుల గొంతుకు చీర చుట్టి సూపరిండెంట్ అధికారిణి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లిందని, ఈ దృశ్యాన్ని తాను,
ముంబై: ముంబై బైకుల్లా జైల్లో మంజుల షెత్యె అనే మహిళా ఖైదీ మృతి పట్ల అక్కడి ఖైదీలంతా తీవ్ర ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫాస్ట్ తక్కువగా పెట్టారని జైలు అధికారిణుల్ని ప్రశ్నించినందుకు.. చిత్రహింసలు పెట్టి మరీ ఆమెను హత్య చేసినట్లుగా ఖైదీలు ఆరోపిస్తున్నారు.
నలుగురైదుగురు కానిస్టేబుల్స్ కలిసి ఆమె మర్మాంగంలో లాఠీను దూర్చి తీవ్రంగా హింసించినట్లు ఖైదీలు ఆరోపించారు. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ముంబై కోర్టు దీనిపై వాదనలు వింది. బైకుల్లా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న ఇంద్రానీ కూడా కోర్టుకు హాజరై తన వాదనను వినిపించింది.

మంజుల హత్యపై ఖైదీలు ఆందోళన చేసిన సమయంలో.. ఇంద్రాణి కూడా అందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జైలు అధికారులు ఇంద్రానీపై కూడా దాడి చేసినట్లు ఆమె తరుపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వాదనలు వినిపించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
కాగా, కోర్టుకు హాజరైన ఇంద్రానీ మంజుల మృతిపై సాక్ష్యం చెప్పింది. తమ పక్క సెల్ లోనే ఉండే మంజుల గొంతుకు దుప్పట్టా బిగించి సూపరిండెంట్ అధికారిణి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లిందని, ఈ దృశ్యాన్ని తాను, తన సహచర ఖైదీలం తలుపు రంధ్రంలోంచి చూశామని పేర్కొంది.
ఈ విషయం బయటకు పొక్కితే తమకూ అలాంటి గతే పడుతుందని బెదిరించినట్లు ఆమె తెలపడం గమనార్హం. బాధితురాలి పట్ల అమానవీయంగా ప్రవర్తించడాన్ని తాను కళ్లారా చూశానని ఇంద్రానీ తెలిపారు. కాగా, ప్రస్తుతం షీనా బోరా హత్య కేసులో ఇంద్రానీ బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications