ఇన్ఫోసిస్ సంక్షోభం: నా డిమాండ్లు పరిష్కరించాల్సిందే, నారాయణమూర్తి ఇలా..
బోర్డు సభ్యులు తనతో సంధి చేసినట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఇన్పోసిస్ ఫౌండర్ చైర్మెన్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. తాను లేవనెత్తిన అంశాలపై బోర్డు నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని
బెంగుళూరు:ఇన్పోసిస్ ఫౌండర్ ఛైర్మెన్ నారాయణమూర్తి మళ్ళీ బాంబు పేల్చారు.ఇన్పోసిస్ లో నెలకొన్న సంక్షోభానికి స్వస్తి పలికేందుకుగాను బోర్డు చేసిన సంధి ప్రయత్నాలు చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.తాను లేవనెత్తిన ఆందోళనలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.
బోర్డు సబ్యులు, కంపెనీల సమస్యలను, ఆందోళనలను సరైన రీతిలో పరిష్కరించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. బోర్డు పారదర్శకతను పాటించాలని ఇన్పోసిస్ పౌండర్ చెర్మెన్ అభబిప్రాయపడ్డారు.
వారందరూ ఎంతో సమగ్రత్త కలిగి మంచి ఉద్దేశ్యం ఉన్న సభ్యులే. కానీ, మంచి వ్యక్తులు కూడ ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిలో ఇది ఒకటన్నారు.

మంచి నాయకత్వమంటే షేర్ హోల్డర్స్ ఆందోళనలన్నింటిని విని, సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన హితవు పలికారు . ఆ మేరకు ఆయన ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
బోర్డు సభ్యులు, తర్వలో నిర్ణయం తీసుకొని కార్పోరేట్ పాలన మెరుగుపర్చి కంపెనీ భవిష్యత్ మంచిగా తీర్చిదిద్దుతారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ, తాను లేవనెత్తిన ఆందోళనలపై మాత్రం సరైన నిర్ణయం తీసుకొనేంత వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు నారాయణమూర్తి.












Click it and Unblock the Notifications