పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు
Recommended Video

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు 13వేల కోట్ల రూపాయలకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోడీపై ఇంటర్పోల్ ఈ నోటీసు జారీ చేసింది.
విదేశాలకు వెళ్లి తలదాచుకుంటున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ఈ రెడ్ కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది. రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ తన సభ్య దేశాలకు జారీ చేస్తుంది.

ఒక దేశానికి సంబంధించిన నేరస్తుడు ఇతర దేశాల్లో ఉంటే.. అతడ్ని అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ తన సభ్య దేశాలను కోరుతోంది. నీరవ్ మోడీ కేసులో సీబీఐ ఇప్పటికే ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేసింది.
నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ, నీరవ్ సోదరుడు నిషాలపై ఇంటర్పోల్ ద్వారా సీబీఐ ఫిబ్రవరి 15న డిఫ్యూజన్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు ద్వారా
నిందితుడు ఏ ప్రదేశంలో ఉన్నాడనే సమాచారాన్ని ఇంటర్ పోల్ సభ్య దేశాలు పంచుకుంటాయి. దీని ద్వారా నీరవ్ ను తొందగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications