తక్కువ ధరలో కాశీ, అయోధ్య, పూరీ irctc ప్యాకేజ్
వేసవి సెలవుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పుణ్యక్షేత్రంకానీ, విహారానికి కానీ వెళ్లిరావాలనుకుంటారు. ఎక్కడికైనా తమను కూడా తీసుకువెళ్లండంటూ పిల్లలు ఒకటే గొడవ చేస్తుంటారు. ఇండియన్ రైల్వేస్కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం తాజాగా అదిరిపోయే టూర్ ప్యాకేజ్ తీసుకువచ్చింది. దీనిద్వారా అందుబాటు ధరలోనే మూడు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. కాశీ, అయోధ్య, పూరి వంటి ప్రాంతాలకు వెళ్లిరావొచ్చు. ఈ టూర్ ఎక్కడి నుంచి ఉంటుంది? ధర ఎంత? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్నిరోజులు? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ను అందుబాటులో ఉంచింది. మే 27 నుంచి ప్రారంభమై జూన్ 4వ తేదీన ముగిసే 9 రోజుల టూర్ మూడు కేటగిరిల రూపంలో ఉంటుంది. కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీ కేటగిరి ప్రకారం ఛార్జీలుంటాయి. వీటిలో మనకు అందుబాటులో ఉంది ఎంపిక చేసుకోవచ్చు. ఎకానమీ కింద డబుల్/ ట్రిపుల్ షేర్ ధర రూ. 15,120గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు రూ. 14,115 నుంచి ప్రారంభమవుతుంది.

స్టాండర్డ్ కేటగిరిలో డబుల్/ ట్రిపుల్ షేర్ ధర రూ. 23,995గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు రూ. 23,815గా ఉంది. కంఫర్ట్ కేటగిరిలో ధర రూ. 31,435 నుంచి ప్రారంభమవుతోంది. డబుల్/ ట్రిపుల్ షేర్కు ఇది వర్తిస్తుంది. 5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు ధర రూ. 30,015గా ఫిక్స్ చేశారు. ఇందులో మనకు అందుబాటులో ఉండేది, నచ్చిన కేటగిరిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఎకానమి అంటే స్లీపర్ క్లాస్లో జర్నీ ఉంటుంది. స్టాండర్డ్ అంటే థర్డ్ ఏసీ టికెట్, కంఫర్ట్ అంటే సెకండ్ ఏసీ టికెట్ తో ప్రయాణించవచ్చు. ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది.
పూరీ జగన్నాథుడు, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, విష్ణు గయ, కాశీ విశ్వనాథ్, గంగా హారతి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి ప్రాంతాలను, ఆ ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శించవచ్చు. విజయనగరం, పెందుర్తి, సమల్ కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్ నుంచి టూర్ కు వెళ్లొచ్చు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications