వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమ్మ అంత్యక్రియలు : దహనం కాదు.. ఖననమే..
తమిళ హిందు బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం జయలలిత పార్థివ దేహాన్ని ఖననం చేయబోతున్నారు.
చెన్నై: తమిళ ప్రియతమ నేత జయలలితకు కడసారి వీడ్కోలు చెప్పడం కోసం ఆమె అభిమానులంతా పార్థివ దేహం వద్దకు పోటెత్తారు. అభిమానులు, ప్రముఖుల తాకిడితో రాజాజీ హాల్ ప్రాంగణమం కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనుమ నడుమ నుంచి జయలలిత అంతిమయాత్ర ప్రారంభమవనుంది.
కాగా, జయలలిత భౌతిక కాయాన్ని ఖననం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ హిందు బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారం జయలలిత ఖననం జరగబోతుంది. అంత్యక్రియలపై తొలుత అనిశ్చితి నెలకొన్నా.. చివరికి పార్థివ దేహాన్ని ఖననం చేయాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో అన్నాడీఎంకె పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ను ఖననం చేసిన మెరీనా బీచ్ లోనే జయలలితను కూడా ఖననం చేస్తుండడం గమనార్హం.
Comments
English summary
Former Tamil Nadu chief minister J Jayalalithaa's mortal remains will be buried, not cremated as per Hindu Brahmin ritual.
Story first published: Tuesday, December 6, 2016, 16:30 [IST]