కశ్మీర్లో జైషే ఉగ్రవాది మహ్మద్ ఇక్బాల్ అరెస్ట్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో సుందర కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుటీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనుమానిత ఉగ్రవాదులు దాడులు చేయడంతో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా ఉగ్రవాది పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాది జైషే మహ్మద్కు చెందిన వారని భద్రతా బలగాలు పేర్కొన్నారు.

బారాముల్లలో జైషే మహ్మద్కు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బరాముల్లలో ఉగ్రవాది నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. బారాముల్లలో డెలినాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అతను మహ్మద్ ఇక్బాల్ నైకు అలియాస్ ఖితాబ్గా గుర్తించారు. ఖితాబ్ .. అబ్దుల్ నైకు కుమారుడుని పేర్కొన్నారు. ఖితాబ్ స్వస్థలం బారాముల్లాలోని సుహైలో కాలనీ అని అధికారులు పేర్కొన్నారు. అతని వద్ద ఆయుధాలు, మందుగుండును కూడా స్వాధీనం చేసుకున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications