ఆస్తుల విలువ మదింపులో తేడా, జయ బృందానికి విముక్తిలా..
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కోర్టులు ఆమె ఆస్తుల విలువను పలు రకాలుగా లెక్కించాయి. ఒక్కో కోర్టు ఒక్కో రకంగా ఆమె ఆస్తి విలువను తేల్చాయి.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కోర్టులు ఆమె ఆస్తుల విలువను పలు రకాలుగా లెక్కించాయి. ఒక్కో కోర్టు ఒక్కో రకంగా ఆమె ఆస్తి విలువను తేల్చాయి.
1996 లో జయలలితపై అక్రమంగా ఆస్తులను సంపాదించిందని సుబ్రమణ్యస్వామి కేసును దాఖలు చేశాడు. ఈ కేసు ఆధారంగానే జయ జైలు ఊచలను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఉన్న కాలంలోనే ఈ కేసు విచారణకు అనుమతి లభించింది. ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ మర్రిచెన్నారెడ్డి మద్య కాలంలో విబేధాల కారణంగానే ఈ కేసు దాఖలైనట్టు అన్నాడిఎంకె వర్గాలు చెబుతున్నాయి.
ఒక్క రూపాయి జీతం తీసుకొనే జయలలిత ఆస్తులను ఎలా కూడబెట్టారంటూ సుబ్రమణ్యస్వామి కేసును దాఖలు చేశారు. ఈ కేసే జయలలితకు చుట్టుకొంది.

సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన కేసు ఏమిటి
సుబ్రమణ్యస్వామి ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలతో జయలలితపై కేసు దాఖలు చేశారు. 1995 ఏప్రిల్ 1వ,తేదిన జయలలితపై కేసును దాఖలు చేస్తున్నట్టుగా సుబ్రమణ్య స్వామి ప్రకటించారు.రూ.66.5 కోట్ల అక్రమాస్తులను జయలలిత కలిగిఉన్నారని ఆమెపై 1996 లో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడానికి సుబ్రమణ్యస్వామియే కారణం.21 ఏళ్ళ పాటు ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.

జయ ఆస్తుల్లో తేడాలు
జయలలిత అక్రమాస్తుల కేసులో కింది కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. కానీ, హైకోర్టు వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరగా, హైకోర్టు లెక్కలను తప్పుబట్టింది. కింది కోర్టు లెక్కలనే సమర్థించింది.జయలలిత ఆస్తులను హైకోర్టు అంచనా వేయడంలో వచ్చిన తేడా వల్ల నిందితులకు ఊరట లభించింది. ఆస్తుల విలువలో తేడాను హైకోర్టు 8.2 శాతం గా లెక్కగట్టి అనుమతించదగిన తేడాగా పేర్కొంటూ నిందితులను వదిలేసింది.

హైకోర్టులో జయ ఆస్తుల విలువ
జయ అక్రమాస్తులను కలిగి ఉందనే ఆరోపణలతో పలు కోర్టుల్లో విచారణ సాగింది.అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా ఆస్తుల లెక్కింపు ఒక్కో కోర్టులో ఒక్కో రకంగా ఉంది .హైకోర్టులో సాగిన లెక్కింపు ఈ రకంగా ఉంది.జయలలితకు 914 పట్టుచీరెలున్నాయి6195 జతల దుస్తులున్నాయి. హైకోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోలేదు. సినీ నటి కావడం వల్లే నిర్మాతల నుండే ఇవి వచ్చాయని హైకోర్టు అభిప్రాయపడింది.చెప్పులను కూడ లెక్కలోకి తీసుకోలేదు. బంగారు, వజ్రాభరణాలను ఎసీబి విలువను పరిగణనలోకి తీసుకొంది. రుణాలను ఆదాయంగా చూపడం ఏసీబీ పరిణనలోకి తీసుకోలేదు.

సెషన్స్ కోర్టులో జయ ఆస్తుల విలువ
జయలలిత ఆమె సంస్థలు నిర్మించిన భవనాల విలువ సుమారు రూ.27.79 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఇవి కాకుండా మరో 150 ఆస్తుల విలువ సుమారు రూ.20.07 కోట్లు ఉంటుందని అంచనావేసింది.సుధాకరన్ వివాహ ఖర్చు సుమారు.రూ.6.45 కోట్లు, బహుమతులు రూ.2.15 కోట్లు , విదేశీ బహుమతులు సుమారు 77 లక్షలు ఉంటుందని అంచనా వేసింది.

సెషన్స్ కోర్టు కు, హైకోర్టుకు ఆస్తుల విలువలో తేడా
జయలలిత, ఆమె సంస్థలు నిర్మించిన భవనాల విలువను హైకోర్టు రూ.22.69 కోట్లుగా నిర్ణయించింది.అయితే సెషన్స్ కోర్టు ఈ భవనాల విలువను రూ.27.79 కోట్లుగా గుర్తించింది. జయలలితకు ఉన్న 150 ఆస్తుల విలువ సేల్స్ డీడ్ల ప్రకారంగా రూ.6.24 కోట్లుగా హైకోర్టు నిర్ధారించింది అయితే సెషన్స్ కోర్టు వీటి విలువను 20.07 కోట్లుగా గుర్తించింది.సుధాకరన్ పెళ్ళి ఖర్చును హైకోర్టు కేవలం రూ.28.68 లక్షలకే పరిమితం చేసింది. సెషన్స్ కోర్టు 6.45 కోట్లుగా లెక్క తేల్చింది.బహుమతుల విలువను హైకోర్టు 1.5 కోట్లుగా తేల్చింది.కాని, సెషన్స్ కోర్టు మాత్రం వీటి విలువ సుమారు 2.80 లక్షలుగా తేల్చింది.ఈ రెండు కోర్టుల్లో ఆస్తుల విలువల్లో తేడా కారణంగా హైకోర్టు ఆమెకు శిక్ష విధించలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications