జియోకు షాక్: 4జీ లో జియో కంటే ఎయిర్టెల్ స్పీడ్ ఎక్కువ
4జీ నెట్వర్క్ల్లో జియో కంటే ఎయిర్టెల్ వేగం ఎక్కువని బ్రాడ్బ్యాండ్ స్పీడ్ టెస్టింగ్ కంపెనీ ఒపెన్ ఓపెన్ సిగ్నల్ తెలిపింది.
న్యూఢిల్లీ: 4జీ నెట్వర్క్ల్లో జియో కంటే ఎయిర్టెల్ వేగం ఎక్కువని బ్రాడ్బ్యాండ్ స్పీడ్ టెస్టింగ్ కంపెనీ ఒపెన్ ఓపెన్ సిగ్నల్ తెలిపింది. ఇదే రకమైన అభిప్రాయాన్ని ట్రాయ్ కూడ వ్యక్తం చేసింది.
రిలయన్స్ ఫీచర్ఫోన్లో ఒకే సిమ్, ఇతర సిమ్లు పనిచేయవు
ట్రాయ్ చెప్పినట్టుగా అత్యంత 4 జీ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తున్న నెట్వర్క్ జియో కాదని ఎయిర్టెల్కు చెందిన 4 జీ వేగం జియో కంటే మెరుగ్గా ఉందని ఓపెన్ సిగ్నల్ తెలిపింది.
4జీ స్పీడును అంచనా వేయడంలో ట్రాయ్ ఉపయోగించిన విధానాల్లో లోపం ఉందని ఓపెన్ సిగ్నల్ ఆరోపించింది. తాము కొత్తగా ప్రవేశపెట్టిన యూవరేజీ పీక్ స్పీడ్ కొలమానం ద్వారా ఎయిర్టెల్ చాలా ఎక్కువ 4జీ వేగాన్ని అందిస్తోందని తెలిపింది.
ఎయిర్టెల్ యావరేజీ పీక్ స్పీడ్ 56.6 ఎంబీపీఎస్ ఉండగా, రిలయన్స్ జియో నెట్వర్క్ది 50 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్టు ఓపెన్ సిగ్నల్ తన బ్లాగ్లో పేర్కొంది. ట్రాయ్ మై స్పీడ్ యాప్ ద్వారా వినియోగదారుల అభిప్రాయం మేరకు ఆదర్శ పరిస్థితుల్లో 4 జీ వేగాన్ని అంచనావేస్తున్నారు.
ఓపెన్ సిగ్నల్ మాత్రం ప్రతిరోజూ 4జీ వివరాలను వినియోగదారుల నుండి సేకరించి వాటి ద్వారా యావరేజీ పీక్ స్పీడ్ను లెక్కగడుతున్నారు. 4 జీ వేగాన్ని ఖచ్చితంగా అంచనావేయడానికి యావరేజీ పీక్ స్పీడ్ విధానమే సరైందని ఓపెన్ సిగ్నల్ అభిప్రాయపడింది.