పుస్తక రూపంలో.. కలాం ఆగిపోయిన ప్రసంగం
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పూర్తి చేయలేని చివరి ప్రసంగాన్ని పుస్తక రూపంలో తీసుకోస్తామని ఆయన సన్నిహితుడు, అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్ తెలిపారు. అబ్దుల్ కలాం గత సోమవారం షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయి, అనంతరం గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అంశం ‘క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్' అనేది కేవలం ఓ ప్రసంగం కాదని శ్రీజన్ పాల్ సింగ్ తెలిపారు. కలాం ఆ అంశంపై పుస్తకం కూడా రాస్తున్నారని, మిగితా సగం త్వరలోనే పూర్తి చేయాలనుకునేవారని శ్రీజన్ పాల్ గుర్తు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆయనే మనల్ని వదిలివెళ్లిపోయారని, కలాం ఆశయాన్ని తాము పూర్తి చేయనున్నట్లు శ్రీజన్ పాల్ తెలిపారు. ఎలాగైనా మిగితా సగం ప్రసంగాన్ని ఆ పుస్తకంలో రాసి విడుదల చేస్తామని శ్రీజన్ చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications