భర్తపై బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ వేధింపుల కేసు
ముంబై: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ భర్త, అత్తల పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సంజయ్ కపూర్, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తోందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
గత కొద్ది రోజులుగా కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తాజాగా కరిష్మా తన భర్త తరపు కుటుంబం తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కరిష్మా ఫిర్యాదుతో సంజయ్ కపూర్ అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ పెట్టుకున్న విడాకుల కేసు బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో ఉంది.
మరోవైపు, కరిష్మాకు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం తెలియదని, డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని సంజయ్ కపూర్ ఆరోపిస్తున్నాడు. తన పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బు కావాలని అడుగుతోందన్నారు. పిల్లలను తనకు అప్పగించాలని భర్త పిటిషన్ వేశాడు. ఈ కేసు మార్చి 3న విచారణకు రానుంది.
-
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!! -
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!!












Click it and Unblock the Notifications