సీఎంకు స్వీట్ కౌంటర్ ఇచ్చిన డీసీఎం, తెలంగాణ ఎన్నికల తరువాత మ్యాటర్ సీరియస్ ?
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అని సిద్ధరామయ్య బహిరంగంగా చెప్పడంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం ఉలిక్కిపడింది. ఈ విషయంపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. సీఎం సీటు విషయంలో తాను బహిరంగంగా మాట్లాడను అని డీకే శివకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏది చెబితే అది పాటించడమే తనకు తెలుసని, వేరే విషయం గురించి, వేరే వాళ్లు మాట్లాడిన మాటలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం విషయంలో పోటాపోటీ లేదని డీకే శివకుమార్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం బీజేపీలో పోటీ ఉందని డీకే శివకుమార్ చెప్పారు.

బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉండటం వలనే ఇంతకాలం అయినా కర్ణాటకలో ప్రతిపక్ష నేతను ఎంపిక చేయలేకపోతున్నారని డీసీఎం డీకే శివకుమార్కు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కొట్లాడుకుంటున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టటీలో మాకుమాకు ఎలాంటి గొడవలు లేవని, తమ వైఫల్యాలను దాచుకునేందుకు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురదచల్లుతున్నారని డీకే శివకుమార్ అన్నారు.
మా ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి వారికి పదవుల పేరుతో చాక్లెట్ ఇవ్వడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. ఆపరేషన్ కమల మళ్లీ తెరమీదకు తీసుకువస్తున్నారని మాకు సమాచారం ఉందని డీకే శివకుమార్ అన్నారు. ఆపరేషన్ కమల విషయంలో అవసరమైతే విచారణ జరిపించాలని మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన సవాల్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు డీకే శివకుమార్ సమాధానం ఇచ్చారు.

మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సలహాను దృష్టిలో ఉంచుకుంటామని డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బిజీబిజీగా ఉన్న డీకే శివకుమార్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత సీఎం సీటు విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
మూఢనమ్మకాలను నమ్మకూడదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. హోస్ పేట్ లోని శ్రీ విరూపాక్షేశ్వర ఆలయాన్ని సందర్శించిన సీఎం సిద్దరామయ్య మూఢనమ్మకాలను నేను నమ్మనని, నాకు దేవునిపై నమ్మకం ఉందని, అయితే ఇది మూఢనమ్మకాల గురించి కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత నమ్మకాలు ఉంటాయని, సమాజానికి మేలు చేస్తే ఆ మూడనమ్మకాలను నమ్ముదామని సీఎం సిద్దరామయ్య చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications