బీజేపీకి సంతోషం, కాంగ్రెస్కు చేదు: సర్వేలో కమలానిదే ముందంజ, ప్రభుత్వానికి వారి ఆసరా
బెంగళూరు: దక్షిణాదిన మరోసారి ఖాతా తెరవాలన్న బీజేపీ ఆశలు ఫలించేలా కనిపిస్తున్నాయి. మరోవైపు, 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ. మరో రాష్ట్రాన్ని అది కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి.
విజయవాణి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 105 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్కు 33, ఇతరులు ఆరు సీట్లు గెలుచుకుంటారు.
విజయవాణి సర్వే ప్రకారం..
కాంగ్రెస్ - 78
భారతీయ జనతా పార్టీ - 105
జేడీఎస్ -33
ఇతరులు - 6

మెజార్టీకి కావాల్సిన స్థానాలు 113. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ సర్వే ప్రకారం స్వతంత్రులు లేదా జేడీఎస్ మద్దతుతో బీజేపీ అధికారం చేజిక్కించుకోవచ్చు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటకలో హంగ్ వస్తుందని ఎక్కువ వరకు ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో కర్నాటక ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? హంగ్ వస్తుందా? లేక ఏ పార్టీకైనా ప్రజలు ఏకపక్ష తీర్పును ఇస్తారా? అనేది ఆసక్తిని రేపుతోంది. ఫలితాల కోసం మే 15వ వరకు వేచి చూడాలి. ఓటింగ్ అనంతరం వచ్చే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను బట్టి అంచనా వేసుకోవచ్చు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications