ప్రధాని స్కాలర్ షిప్, ఉగ్రదాడికి మద్దతు, దాడి, బెంగళూరులో నర్సింగ్ విద్యార్థులు అరెస్టు!
బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా అంతిపుర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబందించి సోషల్ మీడియాలో వీర జవాన్లకు వ్యతిరేకంగా పోస్టు చేసిన ముగ్గురు విద్యార్థులను బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముగ్గురు బెంగళూరు శివార్లలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే ముగ్గురు ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ సహాయంతో బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ సమీపంలోని ఓ కాలేజ్ లో నర్శింగ్ విద్యాభ్యాసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ అదే కాలేజ్ విద్యార్థి కౌసిక్ దెబెనాథ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

ఉగ్రదాడిని వ్యతిరేకించకూడదని, వెంటనే ఆ పోస్టును తొలగించాలని ఈ ముగ్గురు సోషల్ మీడియాలోనే కౌసిక్ ను బెదిరించారు. తరువాత పాకిస్తాన్, ఉగ్రవాదులకు మద్దతుగా వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే ముగ్గురు కౌసిక్ ముందు నినాదాలు చేశారు.
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేసిన కౌసిక్ మీద ముగ్గురు నిందితులు దాడి చేశారు. మా రాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడిని తాము సమర్థిస్తున్నామని ముగ్గురు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications