ఓ మహిళతో సిఎం, వీడియో ఉంది: నిందితుడు
కొచ్చి: సోలార్ కుంభకోణం కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో పాటు ఆరుగురు ప్రముఖ నేతలు ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు చిక్కారని కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించాడు.
సరితా నాయర్ నే ఆ మహిళతో వారు విడివిడిగా ఉన్నప్పటికీ వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని అతను చెప్పాడు. అయితే సరితా నాయర్ రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆ నాయకులకు తెలియకుండా సరితా నాయర్ ఆ వీడియోలు తీసిందని రాధాకృష్ణన్ చెప్పాడు. బ్లాక్ మెయిల్ తీయడానికి తీసిందో, ఆత్మరక్షణ కోసం తీసిందో తనతకు తెలియదని అతను సోలార్ కుంభకోణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద చెప్పాడు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సిఎం చాందీకి చూపించానని ఆయన చెప్పాడు.
ఆరో వీడియోలో మాత్రం ఊమెన్ చాందీ ఉన్నారని, దాంతో ఆ వీడియోను తాను ఆయనకు చూపించలేదని రాధాకృష్ణన్ చెప్పాడు. చాందీ లంచం తీసుకున్నారని రాధాకృష్ణన్ గతంలో ఆరోపించాడు. తాను స్వయంగా రూ.5.5 కోట్లు ఇచ్చానని, రాష్ట్రంలో రెండు పెద్ద సోలార్ ప్రాజెక్టులు పెట్టాడనికి ఈ మొత్తం ఇచ్చానని చెప్పాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications