కోహినూర్ డైమండ్ పై తేలిన నిజం.. ప్రభుత్వం ఆ పని చేయాలన్న శశిథరూర్
కోహినూర్ వజ్రం మనదే.. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప, మనది అని చూపించుకోవడానికి అది ప్రస్తుతం మన అధీనంలో లేదు. కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి అత్యంత విలువైన కోహినూర్ డైమండ్ ఇండియాకు తీసుకువస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. కోహినూర్ వజ్రంతోపాటు భారతదేశం నుంచి ఎంతో విలువైన సంపదను బ్రిటీషర్లు తమ దేశానికి దోచుకు వెళ్లారు. అలా కోహినూర్ వజ్రం మన దేశం నుంచి మాయమై బ్రిటన్ కు చేరింది.
అయితే తాజాగా బ్రిటన్ రాజప్రసాదంలో ఉన్న అమూల్యమైన కోహినూర్ వజ్రం తో పాటు విలువైన ఆభరణాలు వజ్రాలు ఎక్కడ నుండి వచ్చాయి అన్నదానిపై ది గార్డియన్ పత్రిక బ్రిటన్ రాజసంపదపై పరిశోధనలు చేసింది. "కాస్ట్ ఆఫ్ ది క్రౌన్" పేరుతో ముద్రించిన పరిశోధనాత్మక కథనాలలో బ్రిటన్ రాజసంపద భారతదేశం నుంచి తీసుకువచ్చింది అని తేల్చింది. 1912 నుండి జరిగిన అనేక పరిణామాలను 42 పేజీలతో ది గార్డియన్ పత్రిక వివరించింది.

ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటన్ మహారాణి అధికారిక నివాసమైన టవర్ ఆఫ్ లండన్ లో ఉంది. బ్రిటన్ పాలించిన దేశాల నుంచి తెచ్చిన ఎన్నో విలువైన వజ్రాలు, బంగారు వస్తువులు, ఇతర విలువైన సంపదను ఆ దేశాలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ముఖ్యంగా గత సంవత్సరం బ్రిటన్ రాణి మరణం తర్వాత ఈ డిమాండ్లు బాగా ఊపందుకున్నాయి.
అయితే తాజాగా గార్డియన్ పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలతో కాంగ్రెస్ పార్టీ నుండి కొత్త డిమాండ్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బ్రిటిష్ పాలనా కాలంలో గొప్ప నాగరికత మిషన్ యొక్క యాదృచ్ఛిక దోపిడీ అప్పుడు సాగిందని కొందరు చెబుతున్నా, వలస రాజ్యాల నిజమైన దోపిడీ ఏమిటో గార్డియన్ పత్రిక అందరికీ అర్థమయ్యేలా చెప్పిందని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
This @guardian expose shows that colonial loot &pillage is being recognised for what it really was, rather than being dressed up as the incidental spoils of some noble ‘civilising mission’. Time to negotiate the return of stolen property! https://t.co/IxqlbL96aF
— Shashi Tharoor (@ShashiTharoor) April 7, 2023
అంతేకాదు దొంగిలించబడిన ఆస్తిని తిరిగి తీసుకురావడం కోసం చర్చలు జరపడానికి ఇది సరైన సమయం అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి కోహినూర్ వజ్రం భారతదేశానిదే అని ది గార్డియన్ పత్రిక పక్కా ఆధారాలతో ప్రచురించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని, భారతదేశం నుండి కొల్లగొట్టుకుపోయిన సంపదను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications