డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా.. ఏటీఎంలో చిరుతపులి పిల్ల
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లా థంగ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఓ చిరుతపులి పిల్ల అటవీ ప్రాంతంలో నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిది. అది ఓ ఏటీఎం కేంద్రంలో తలదాచుకుంది. డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిన వారికి ఏటీఎంలో చిరుతపులి పిల్ల కనిపించింది.
దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ చిరుతపులి పిల్లను కాపాడి సురక్షితంగా జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

థంగ్ ప్రాంతంలోని ఆ ఏటీఎంలోకి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లారు. అతను పులి పిల్లను చూసి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. ఏటీఎంలో దూరిన పులిపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.
ఆ తర్వా అటవీ శాఖ అధికారులను పిలిచారు. వారితో పాటు ఓ ట్యాక్సీ డ్రైవర్ దానిని బయటకు తీసుకు వచ్చారు. అక్కడ ఉన్న వాహనాన్ని ఎక్కించి అడవిలో వదిలారు. కాగా, చలి కారణంగా ఆ చిరుతపులి పిల్ల ఏటీఎంలో తలదాచుకుందని భావిస్తున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications