మిగిలింది మరో 10 రోజులే : మోడీని గుజరాత్కు పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు
మొదటి దశ సార్వత్రిక ఎన్నికలకు నేటి నుండి పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకనేందుకు పార్టీలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య విమర్శలు తీవ్ర తరం చేశాయి. దీంతో పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తోపాటు వైసీపి అధినేత వైఎస్ జగన్ లు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు అభ్యర్థుల గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక అటు జనసేన ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.

READ MORE












Click it and Unblock the Notifications