వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాబాలో దారుణం: ఎక్కువ తిన్నాడని దుస్తులిప్పేసి కొట్టారు

By Pratap
|
Google Oneindia TeluguNews

భోపాల్: తన వాటా ఎక్కువ ఆహారం తిన్నాడని ఆరోపిస్తూ డాబా యజమాని తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిని దుస్తులిప్పేసి చితకబాదాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 178 కిలోమీటర్ల దూరంలో గల బీతుల్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

డాబా యజమానితో పాటు అతని సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 ఏళ్ల వయస్సులో ఉన్న బాదితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని మనీష్‌గా గుర్తించారు.

స్థానిక డాబాల్లో సిబ్బందికి మధ్య వివాదాలు చాలా తరుచుగా జరుగుతుంటాయి. గొడవలు కూడా అతి సాధారణం. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ డాబాలో ముగ్గురు ఉద్యోగులు 30 ఏళ్ల వ్యక్తిని చంపేశారు.

భోజనం బాగా లేదనే ఆరోపణలతో వాగ్వాదం చెలరేగి అతని హత్య కు దారి తీసింది. భోజనం కోసం అతను తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో గల కమల్ డాబాకు వెళ్లాడు. తనకు వడ్డించిన భోజనం బాగా లేదని ఫిర్యాదు చేశాడు.

దాంతో డాబాకు చెందిన ముగ్గురు ఉద్యోగులు అతనిపై దాడి చేశారు. విపరీతంగా కొట్టడంతో అతను మరణించాడు.

English summary
A man working at an eatery in Madhya Pradesh's Betul district, 178 km from capital Bhopal, was allegedly stripped and beaten up by his boss for eating more than his share of food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X