మన్మోహన్ సింగ్కు డెంగ్యూ నిర్ధారణ: ఆరోగ్యం మెరుగుపడుతోందన్న ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వివరించారు. కాగా, 89 ఏళ్ల మన్మోహన్ సింగ్కు సోమవారం జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఎయిమ్స్లోని కార్డియో న్యూరో సెంటర్ ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీశ్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులని, జూలో జంతువులు కాదని మండిపడ్డారు.
కాగా, డెంగ్యూ వ్యాధి బారినపడి మన్మోహన్ సింగ్ మూడు రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)వెళ్లి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరన్ కౌర్ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.అయితే కేంద్రమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ మండిపడ్డారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్ను గదిలోకి తీసుకొచ్చినప్పుడు తన తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సలు వినిపించుకోలేదని అన్నారు. తమ తల్లిదండ్రుల కోరికకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అసహనం వ్యక్తం చేశారు. 'ఆరోగ్య మంత్రి మా కుటుంబాన్ని పరామర్శించడం సంతోషంగా ఉంది. అయితే ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఫోటో దిగే స్థితిలో లేరు. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు వృద్ధులు. జూలో జంతువులు కాదు. అని దమన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు.
కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మన్మోహన్ సింగ్కు జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన రాహుల్ గాంధీ.. దాదాపు అరగంటపాటు అక్కడేవున్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ను ఆయన కలిశారు. మన్మోహన్ సింగ్కు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రాహుల్ గాంధీ.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications