'మన్మోహన్ బలహీన ప్రధాని కాదు, కొన్ని కారణాల వల్ల మౌనం'
యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బలహీనమైన ప్రధాని కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. కొన్ని కారణాల వల్ల మన్మోహన్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారన్నారు.
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బలహీనమైన ప్రధాని కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. కొన్ని కారణాల వల్ల మన్మోహన్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారన్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మనీష్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నకు పైవిధంగా సమాధానం ఇచ్చారు. మన్మోహన్ బలహీనమైన ప్రధాని కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

ఒకవేళ ఆయన బలహీనమైన వ్యక్తి అయితే పౌర అణు ఒప్పందం దిశగా వెళ్లేవారే కాదని అభిప్రాయపడ్డారు. కొన్ని కారణాల వల్లే ఆయన మౌనం పాటించాల్సి వచ్చిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై తివారీ విమర్శలు గుప్పించారు. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రజలను విడగొట్టేలా మాట్లాడారని, ఓ ప్రధాని ఇలా మాట్లాడడం ఆందోళన కలిగించేలా ఉందన్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతతో మాట్లాడాలన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications