పేటీఎం లేకుంటే బహిష్కరణా, ఆర్బీఐకి అవమానం: రాహుల్ చినిగిన షర్ట్ (వీడియో)
నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారని, ఆర్బీఐని సైతం ఖూనీ చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నాడు మండిపడ్డారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారని, ఆర్బీఐని సైతం ఖూనీ చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నాడు మండిపడ్డారు.
నోట్ల రద్దు చేసినంత వేగంగా మిగతా నిర్ణయాలను మోడీ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఇవాళ ప్రజలు ఎక్కడకు వెళ్లినా ఓ ప్రశ్న ఎదురవుతోందన్నారు. పేటీఎం ఉందా, ఒకవేళ పేటీఎం లందేటం బయటకు వెళ్లిపొమ్మనే సమాధానం వస్తోందని ఆరోపించారు. పేటీఎం లేదంటే బహిష్కరిస్తారా అని నిలదీశారు.
ఎంతోమంది పేదలకు అన్నం పెడుతున్న చరఖా (రాట్నం) ముందు కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రధాని మోడీ కేవలం యాభై మంది బడాబాబులకు మేలు చేసే విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.

స్వాతంత్రం కోసం, త్రివర్ణ పతాకం కోసం మహాత్మా గాంధీ ఎనలేని త్యాగాలు చేశారన్నారు. ఇప్పుడేమో ఖాదీ క్యాలెండర్ మీద ఆయన ఫోటోను తొలగించి, మోడీ ఫోటోలు ముద్రించారన్నారు. కొన్నిచోట్ల రాంలీలా నాటకాల్లో రాముడి పాత్రధారికి మోడీ మాస్కులు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఏముంటుందన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ పైన కొన్ని నెలల పాట రీసెర్చ్ చేశానని, స్వాతంత్రానంతరం 52 ఏళ్ల పాటు నాగపూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకం లేదని తెలిసిందన్నారు. ఇదేనా వాళ్ల దేశభక్తి అన్నారు.
రిజర్వ్ బ్యంకు విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఆర్బీఏ పటిష్టతకు, ఆర్థిక నిర్ణయాలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, అలాంటి సంస్థను మోడీ కేవలం ఒకే ఒక్క నిమిషంలో హత్య చేశారన్నారు.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను కూడా పేదవాడినే అని చెప్పారు. తన కుర్తా చినిగిపోయందని సభకు హాజరైన వారికి చూపించారు. తాను కూడా పేద కుటుంబానికి చెందినవాడినే అన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications