ప్రధాని మోడీ వద్ద ఉన్న నగదు రూ.4,700 మాత్రమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పెద్దగా ఆస్తులు లేవనే విషయం అందరికీ తెలిసిందే. పదమూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన బంగ్లా మాత్రమే అతని దగ్గరున్న ప్రధానమైన ఆస్తి. దీని ధర కాలక్రమంలో 25 రెట్లు పెరిగింది. దీనివల్ల ఆయన ఆస్తుల విలువ రూ.1.41 కోట్లకు చేరుకుంది.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తన వద్ద ఉంచున్న నగదు విలువ మాత్రం వేలల్లోనే ఉంది. అతని వద్ద అక్షరాలా రూ.4,700 ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరాంతానికి ప్రధాని ోడీ వద్ద ఉన్న చేతిలో నగదు రూ.4,700 అని పీఎంవో తెలిపింది.
ఈ మేరకు ఆయన ఆస్తుల వివరాలను పిఎంవో సోమవారం వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోడీ చేతిలో నగదు రూ. 2014 ఆగస్టు 18 నాటికి రూ.38,700 ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసిపోయే సమయానికి రూ.4,700 మాత్రమే ఉన్నాయి.
ప్రధాని మోడీ స్థిరాస్థులు, చరాస్థులు 2015 మా్చి 31న కొద్దిగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ.1 కోటి 26 లక్షల 12వేల 288 నుంచి రూ.1 కోటి 41 లక్షల 14వేల 893కు పెరిగాయి. ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనాలు లేవు. ఇప్పటికీ గుజరాత్లోనే బ్యాంకు ఖాతా ఉంది. ఢిల్లీలో ఖాతా లేదు.