Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘనంగా ముగిసిన న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2026 - పోటెత్తిన పాఠక లోకం..!!

జనవరి 10 నుండి 18 వరకు న్యూఢిల్లీలో ముగిసిన 53వ ప్రపంచ పుస్తక మహోత్సవం 2026, ఉచిత ప్రవేశ విధానంతో అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా నిర్వహించిన ఈ తొమ్మిది రోజుల ఉత్సవం, గతేడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్యలో 20% పెరుగుదలను, పుస్తకాల అమ్మకాల్లో 30% వృద్ధిని సాధించిందని ప్రకటించింది.

దేశవ్యాప్తంగా, విదేశాల నుండి సుమారు 2 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించిన ఈ కార్యక్రమం, విద్యార్థులు, కుటుంబాలు, యువ పాఠకుల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. ఉచిత ప్రవేశం పుస్తక ప్రదర్శనను పుస్తకాలు, ఆలోచనల విస్త్రృత ప్రజా ఉత్సవంగా మార్చింది.

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ఏర్పాటు చేసిన ఈ ఫెయిర్‌లో 35కు పైగా దేశాల నుండి 1,000 మందికి పైగా ప్రచురణకర్తలు, 1,000 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. అలాగే, 600కు పైగా కార్యక్రమాలను నిర్వహించారు.

ఉచిత ప్రవేశంతో సందర్శకుల సంఖ్య పెరిగి, పలు వర్గాల ప్రచురణకర్తలు ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకున్నారు. చిన్నారులు, సాధారణ ఆసక్తి గల పుస్తకాల ప్రచురణకర్తలు తమ శీర్షికలకు డిమాండ్ పెరిగి, విక్రయాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తకాల అమ్మకాలు 30% పెరిగాయి. ఇది సందర్శకులలో పెరిగిన ఆసక్తి, కొనుగోలు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అనేకమంది ప్రచురణకర్తలు కుటుంబాలు, విద్యార్థులు, కొత్త సందర్శకులు స్టాల్స్ వద్ద ఎక్కువ సమయం గడుపుతూ, మెరుగైన కొనుగోలు ఆసక్తి చూపారని తెలిపారు.

ఈ ఏడాది, NDWBF నిర్వాహకులైన NBT వినూత్న స్టాల్స్‌ను ప్రదర్శించిన ప్రచురణకర్తలకు 'అభినందన పత్రాలు' అందించింది. ఖతార్ (గౌరవ అతిథి), భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నోషన్ ప్రెస్, రాజ్‌కమల్ ప్రకాషన్, హార్పర్‌కాలిన్స్, పెగసిస్, V K గ్లోబల్ వాటిలో ఉన్నాయి.

NDWBF 2026లో ప్రధాన ఆకర్షణ 'ఇండియన్ మిలిటరీ హిస్టరీ: వాలర్ & విజ్‌డమ్ @75' థీమ్ పెవిలియన్. 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌లో భారత సైనిక చరిత్రపై 500కు పైగా పుస్తకాలు ప్రదర్శించబడ్డాయి.

అర్జున్ ట్యాంక్, INS విక్రాంత్, LCA తేజస్ ల లైఫ్‌సైజ్ ప్రతిరూపాలు, 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల జీవితాలు, కృషిని వివరించే ప్రదర్శనలు ఇక్కడొక విశేషం. ప్రాచీన భారతీయ యుద్ధ పటిమ, కార్గిల్ సంఘర్షణలు, 1971 యుద్ధం వంటివి కవర్‌ చేస్తూ 100కు పైగా సెషన్లను నిర్వహించారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు, మాజీ సైనికులు నాయకత్వం, జాతీయ భద్రత, దేశసేవపై ప్రేక్షకులతో చర్చలు జరిపారు. ఆర్మీ చీఫ్, నేషనల్ చీఫ్ ఈ పెవిలియన్‌ను సందర్శించి, యువ పాఠకులు 'కిండిల్ జనరేషన్' నుండి వచ్చినా, పుస్తకాలతో చురుకుగా పాల్గొనడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

గౌరవనీయులైన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఖతార్, స్పెయిన్ దేశాల గౌరవ మంత్రుల సమక్షంలో NDWBF 2026ను ప్రారంభించారు. కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి అమిత్ షా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వంటి ప్రముఖులు సందర్శించారు.

సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేషనల్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి వంటి ప్రముఖులు ఫెయిర్‌ను సందర్శించారు. మిజోరాం, తమిళనాడు, త్రిపుర గవర్నర్‌లు కూడా హాజరయ్యారు.

శుభాన్షు శుక్ల, రికీ కేజ్, స్మృతి ఇరానీ, హేమ మాలిని, జయ కిశోరి, కైలాష్ సత్యార్థి వంటి ప్రముఖ రచయితలు, ఆలోచనాపరులు, ప్రజా ప్రముఖులు ఈ పుస్తక మహోత్సవానికి హాజరై, తమ సెషన్‌లలో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించారు.

ఖతార్ గౌరవ అతిథి దేశంగా, స్పెయిన్ ఫోకస్ దేశంగా అంతర్జాతీయ భాగస్వామ్యం NDWBF 2026కు ప్రధాన ఆకర్షణ. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కార్నర్‌లో ప్రపంచ సాహిత్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.

స్పానిష్, ఆస్ట్రియా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, చిలీతో సహా 35కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాహిత్యం, జీవన అనుభవాలు, ప్రకృతి, సహజీవనం, జ్ఞాపకాలు, వలసలు, బహుభాషా కవిత్వం వంటి అంశాలపై చర్చలు జరిపారు.

స్పానిష్ సాహిత్య సంప్రదాయాలు, బహుభాషా కవిత్వ ఆవశ్యకతను నొక్కిచెబుతూ చర్చలు సాగాయి. ఖతార్ నేతృత్వంలో గల్ఫ్ ప్రాంతంతో సాంస్కృతిక మార్పిడి, భారత్-ఇరాన్‌ల చారిత్రక బంధాలు, వలసల సాహిత్య ప్రతిస్పందనలు వంటి ఇతర సెషన్లు జరిగాయి. ఇవి పుస్తక మేళాకు అంతర్జాతీయ ప్రాముఖ్యత చేర్చాయి.

పిల్లలు, కుటుంబాలు NDWBF 2026కు కేంద్ర బిందువు. "కిడ్జ్ ఎక్స్‌ప్రెస్" చిన్నారుల పెవిలియన్‌లో కథలు చెప్పడం, నాటకాలు, కళా, చేతిపనుల వర్క్‌షాప్‌లు, క్విజ్‌లు, వేద గణితం, పుస్తక రూపకల్పన వర్క్‌షాప్‌లు, బాల రచయితలతో సంభాషణలు వంటివి నిర్వహించారు.

ఈ వేడుకలు జరిగిన ప్రతి రోజు సాయంత్రం రికీ కేజ్, మంగణియార్స్, రహస్య ది ప్రాజెక్ట్, భారత సాయుధ దళాల బ్యాండ్‌ల ప్రదర్శనలతో పాటు, సమకాలీన సంగీత ప్రదర్శనలతో సందర్శకులను ఉర్రూతలూగించాయి. ఈ ప్రదర్శనలు యాంఫీథియేటర్‌కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించాయి.

NDWBF 2026 సమాప్తి సందర్భంగా, "పౌరులు చదువుకున్నప్పుడే దేశం పురోగమిస్తుంది" అనే గౌరవనీయులైన ప్రధానమంత్రి దార్శనికతను ఇది పునరుద్ఘాటించింది. విపరీతమైన ప్రజా స్పందన, మెరుగైన ఆదరణ, అంతర్జాతీయ మార్పిడి భారతదేశంలో పఠన సంస్కృతి, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రస్ఫుటం చేశాయి.

ఈ విజయం స్ఫూర్తితో, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా 2027 జనవరి 16 నుండి 24 వరకు జరగనున్న తదుపరి న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక మహోత్సవానికి పాఠకులను, ప్రచురణకర్తలను, రచయితలను స్వాగతించడానికి ఉత్సాహంగా ఉంది. భవిష్యత్ మహోత్సవాలకు కూడా ఉచిత ప్రవేశం కొనసాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+