కూల్ న్యూస్ : పాత నోట్ల మార్పిడిపై టెన్షన్ అవసరం లేదు!
న్యూఢిల్లీ : పాత నోట్ల మార్పిడిని ఉన్నపళంగా కేంద్రం రద్దు చేయబోతుందంటూ శుక్రవారం సాయంత్రం మీడియాలో వార్తలు రావడంతో.. సామాన్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఆ వార్తలన్ని అవాస్తవాలేనని స్పష్టం చేశారు ఉన్నతాధికారులు. పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబతున్నారు.

కొత్త నోట్లు సామాన్యులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే.. పాత నోట్ల మార్పిడిని రద్దు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత ప్రకటించన విధంగానే డిసెంబర్ నెలఖారు వరకు పాత నోట్ల మార్పిడికి అవకాశం ఉంటుందని.. ఆపై.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
ఒకవేళ అప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రాకపోతే నోట్ల మార్పిడికి గడువును పొడగించే అవకాశమున్నట్టు తెలియజేశారు. ప్రజలు వదంతులను భయాందోళనలకు లోనుకావద్దని సూచించారు.












Click it and Unblock the Notifications