కోర్టును దిక్కరించిన మంత్రి: నాన్ బెయిలబుల్ వారెంట్లు
లక్నో: నేను మంత్రిని తనను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యం చేసిన మంత్రికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. మంత్రిగారితో పాటు 32 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి యాసీర్ షాకు ఈ వారెంట్లు జారీ అయ్యాయి.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2007 సంవత్సరం లో ఒక వ్యక్తి భారీగా మత్తు మందులు సేకరించి పెట్టుకున్నాడని యాసీర్ షా తెలుసుకున్నారు. తరువాత అతనిని యాసీర్ షా గృహ నిర్బంధం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రితో పాటు పోలీసు అధికారుల మీద ఆరోపణలు వచ్చాయి. నాన్పరా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతున్నది. అయితే మంత్రి యాసీర్ షాతో పాటు ఆరోపణలు ఎదుర్కోంటున్న వారు కేసు విచారణకు సక్రమంగా హాజరు కాలేదు.

కేసు విచారణ కుంటుపడుతున్న దృష్ట్యా న్యాయస్థానం వీరికి సమన్లు జారీ చేసింది. అయినా వీరు లెక్క చెయ్యలేదు. సమన్లును సైతం ధిక్కరించిన మంత్రిపై శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బర్ బాంకీ సర్వజీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 12వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు. మంత్రిని కోర్టు ముందు హాజరు పరచాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. మే 12వ తేది లోపు మంత్రిని కోర్టు ముందు హాజరు పరుస్తామని లక్నో ఎస్పీ బరాచి ఆర్.ఎల్. వర్మా తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications