వేధింపులు: అమ్మాయిలు మెట్రో రైల్లో కత్తులు తీసుకెళ్లవచ్చు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మెట్రోలో వెళ్లే మహిళలు తమ వెంట కత్తిని తీసుకు వెళ్లవచ్చు.
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మెట్రోలో వెళ్లే మహిళలు తమ వెంట కత్తిని తీసుకు వెళ్లవచ్చు. అయితే, అది నాలుగు అంగుళాలు ఉండాలని సూచించారు.
ఢిల్లీ మెట్రో రైలులో రోజుకు దాదాపు ముప్పై లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరు స్టేషన్లోకి వెళ్లే ముందు సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేస్తుంటుంది. ఇప్పుడు ఇదే సీఐఎస్ఎఫ్ మహిళలు కత్తులు, అగ్గిపెట్టెలు, లైటర్లు తమ వెంట తీసుకు వెళ్లవచ్చునని చెప్పింది.
బెంగళూరులో యువతిని వేధించిన షాకింగ్ వీడియో: ఒకడు ఎవరంటే.. కామాంధులు వీరే..

ప్రయాణీకులు ఒక లైటర్, ఒక మ్యాచ్ బాక్స్ తీసుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని, అలాగే ప్రయాణీకులు వారి వారికి అవసరమైనవి తీసుకు వెళ్లవచ్చునని చెప్పారు. అలాగే, మెట్రోలో ప్రయాణించే కార్మికుల నుంచి తమకు ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయన్నారు. గునపం, పార వంటి ఆయుధాలు తీసుకు వెళ్లనివ్వాలని కోరారని అధికారులు చెబుతున్నారు.
ఎవరైనా ప్రయాణీకులు టూల్స్ తీసుకు వెళ్తవచ్చునని, అయితే అనుకోని సంఘటనలు జరిగితే వారిని కూడా విచారిస్తామన్నారు. అదే సమయంలో నాలుగు అంగుళాల కత్తిని మహిళలు తీసుకు వెళ్లవచ్చునని చెబుతున్నారు. ఇటీవల మహిళల పైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
రక్షణ కోసం కత్తులు దగ్గరపెట్టుకోవచ్చని అనుమతించినా ప్రయాణికులెవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే హక్కు అధికారులకు ఉంటుంది.
మెట్రోలో వెళ్లేటప్పుడు తీసుకెళ్లకూడని వస్తువుల జాబితా మేరకు ఇప్పటికే సెక్యూరిటీ చెక్ వద్ద పట్టుబడిన వస్తువులు ఢిల్లీ శాస్త్రి పార్క్లోని సీఐఎస్ఎఫ్ డిపోలో గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని నియమాలు సడలించారు. కార్మికులు తమ వృత్తికి సంబంధించిన పనిముట్లు తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications