వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎదురుకాల్పులు: ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజామున పహల్గామ్ వద్ద సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. వాటిని భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మూడు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నుంచీ ఉగ్రవాదులకు తెగుబడుతుండగా, భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి.
ముగ్గురు ఉగ్రవాదులు హతమవడంతో ఆపరేషన్ పూర్తయినట్లు భద్రతాదళాధికారులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కొందరు ఉగ్ర మద్దతుదారులు ఆ ఉగ్రవాదులను రక్షించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.
Comments
srinagar jammu and kashmir security forces militants killed terrorists శ్రీనగర్ జమ్మూకాశ్మీర్ భద్రతా దళాలు ఉగ్రవాదులు మృతి
English summary
The people were back on the streets of Awoora village in Pahalgam, Jammu and Kashmir, to help two militants trapped in a house escape. The security forces had a tough time in controlling the mob as well as fighting the terrorists.
Story first published: Monday, January 16, 2017, 10:42 [IST]