వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌కు మోడీ పయనం, షింజో అబే అంత్యక్రియలకు హాజరు

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోడీ జపాన్ బయల్దేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన టోక్యోకు పయనం అయ్యారు. ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు రేపు టోక్యోలో నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే షింజో అంబే అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు.

 PM Modi leaves for Japan for Shinzo Abe’s funeral

దీనికి సంబంధించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరవుతానని, షింజో అబే తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. భారత్-జపాన్ మైత్రికి సంబంధించి గొప్పగా కృషి చేశారని మోడీ అభివర్ణించారు. షింజో అబే వంటి మహోన్నత నేతను కోల్పోయినందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, అబే అర్ధాంగికి భారతీయులందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని వివరించారు.

షింజో అబే ఆశయాలను కొనసాగిస్తూ భారత్, జపాన్ సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. జపాన్ పర్యటన సందర్భంగా మోడీ.... జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో స్వల్పకాలిక భేటీలో పాల్గొంటారని తెలుస్తోంది. జులై 8న ఎన్నికల ప్రచారం సందర్భంగా షింజో అబే ఓ మాజీ సైనికుడి చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

English summary
Prime Minister Narendra Modi left for Tokyo on Monday evening to attend the state funeral of Japan’s former PM Shinzo Abe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X