బీజేపీ అంటే ఇష్టం లేదు, సుమలతకు మద్దతు, సీఎం కొడుకు అవసరమా ? నటుడు ప్రకాష్ రాజ్ !
బెంగళూరు: సయాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ కు ఆయన భార్య సుమలత జీవితాంతం తోడు ఉన్నారని బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. సుమలత మండ్య కోడలు అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని, ప్రకాష్ రాజ్ అన్నారు. సుమలతకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, బీజేపీ అంటే తనకు ఇష్టం లేదని ప్రకాష్ రాజ్ చెప్పారు.
సుమలతకు రాజకీయాలు తెలీదు అనడంలో అర్థం లేదని, ఆమెకు తన సంపూర్ణ మద్దతు ఉందని ప్రకాష్ రాజ్ చెప్పారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో ఉన్నారు. బెంగళూరులోని మాగడి రోడ్డులో ఉన్న అంజన్ సినిమా థియేటర్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన తన రాజీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు.

సుమలత హక్కు
మండ్య ప్రజలు చాలా ఆలోచించాలని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుమలత రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు సుమలతకు ఉందని ప్రకాష్ రాజ్ చెప్పారు.

మంచి వ్యక్తి
తనకు సుమలతతో అనేక స���వత్సరాల నుంచి పరిచయం ఉందని, ఆమె చాల మంచి వ్యక్తి అని, ఆమెకు తన సంపూర్ణ మద్దతు ఉందని ప్రకాష్ రాజ్ తెలిపారు. సుమలత లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఆ వయసు లేదు
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి రాజకీయాల్లోకి వచ్చే వయసు లేదని ప్రకాష్ రాజ్ చెప్పారు. నిఖిల్ కుమారస్వామి ఇంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉందా అని ప్రకాష్ రాజ్ అన్నారు.

చెడ్డ పేరు వస్తుంది
కొంత కాలం క్రితమే సినీ రంగంలో ప్రవేశించిన నిఖిల్ కుమారస్వామి ఆ రంగంలో పైకి రావడానికి ప్రయత్నించాలని ప్రకాష్ రాజ్ సలహా ఇచ్చారు. రాజకీయ కుటుంబంలో ఉన్నాననే ఒక్క కారణంతో నిఖిల్ కుమారస్వామి రాజకీయల్లోకి వస్తే చాలా చెడ్డపేరు వస్తుందని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక���తం చేశారు.

ప్రజల నిర్ణయం
నిఖిల్ కుమారస్వామి రాజకీయంగా పైకి రావాలా ? వద్దా ? అనే విషయం ప్రజలు నిర్ణయిస్తారని ప్రకాష్ రాజ్ చెప్పారు. నాకు వ్యక్తిగతంగా బీజేపీ, ఆ పార్టీ పరిపాలన అంటే ఇష్టం లేదని ప్రకాష్ రాజ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తనకు ఆప్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ఇచ్చాయని ప్రకాష్ రాజ్ చెప్పారు.

మాజీ ప్రధానితో భేటీ
లోక్ స�� ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఇటీవల మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మద్దతు కోరానని, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తాను ఆలోచిస్తానని హామీ ఇచ్చారని ప్రకాష్ రాజ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తాను మద్దతు కోరానని ప్రకాష్ రాజ్ చెప్పారు. బెంగళూరు లోక్ సభ నియోజక వర్గంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదని, అందుకే ఆ పార్టీని తనకు మద్దతు ఇవ్వాలని మనవి చేశానని ప్రకాష్ రాజ్ అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications