సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గౌహతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ముర్మ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారి సుఖోయ్-30 ఎంకేఐ(Sukhoi-30) యుద్ధ విమానంలో ప్రయాణించారు. శనివారం ఉదయం తేజ్పూర్లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్నారు.
రాష్ట్రపతి తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లయింగ్ సూట్ ధరించి సుఖోయ్-30 విమానంలో కొద్దిసేపు విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు.

President Droupadi Murmu took a historic sortie in a Sukhoi 30 MKI fighter aircraft at the Tezpur Air Force Station in Assam. President Murmu is the third President and second woman President to undertake such a sortie. pic.twitter.com/DozRAWm3Yp
— President of India (@rashtrapatibhvn) April 8, 2023
మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్ ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్ కాంచనగంగ సాహాసయాత్ర-2023ను రాష్ట్రపతి ప్రారంభించారు. శనివారం సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.












Click it and Unblock the Notifications