సాధ్వీని సాగనంపాలన్న నితీశ్.. బీజేపీతో తెగదెంపులు చేసుకొమ్మని రబ్రీ సవాల్..
పాట్నా : గాడ్సే దేశభక్తుండంటూ సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కామెంట్లపై బీహార్లో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ ఊహించని షాక్ ఇచ్చింది. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు.
పాట్నాలో ఓటువేసిన అనంతరం ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు నితీశ్ కుమార్ ఈ సమాధానం ఇచ్చారు. సాధ్వీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. అలాంటి కామెంట్లకు తమ మద్దతు ఎప్పుడూ ఉండదని స్పష్టం చేశారు. అయితే ఈ అంశం బీజేపీ అంతర్గత వ్యవహారమైనందున సాధ్విపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకే ఉందని అభిప్రాయపడ్డారు.

సాధ్వీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న బీహార్ సీఎం వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఫైర్ అయ్యారు. గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ చేసిన వ్యాఖ్యలు ఆయనను నిజంగా బాధించి ఉంటే వెంటనే బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రబ్రీ సాధ్వీ మాటలు అంతగా బాధించి ఉంటే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోని పార్టీతో కలిసి ఎందుకు పని చేస్తున్నారని రబ్రీ ప్రశ్నించారు. నితీశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!












Click it and Unblock the Notifications