రాఫెల్ రభస: కొనుగోలు ధరలో తేడా ఉందన్న రక్షణశాఖ జాయింట్ సెక్రటరీ...కాగ్ వద్దకు ఫైల్
ఢిల్లీ: సెప్టెంబర్ 2016లో ఆనాటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ల మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అయితే అంతకు నెలముందే ఈ ఒప్పందం చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన రక్షణశాఖ అధికారి ఒకరు రాఫెల్ బెంచ్ మార్క్ ధరపై ఆ ఒప్పందంపై అభ్యంతరం తెలిపినట్లు ఈ సమాచారం తమ వద్ద ఉన్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ఆ అధికారి రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ మరియు అక్విజిషన్ మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపింది.

అభ్యంతరాలు ఉన్న ఫైలును స్టడీ చేస్తున్న కాగ్
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ రక్షణశాఖ అధికారి ఒప్పందం పై అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఒప్పందంలో జాప్యం జరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. అతని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ప్రభుత్వం సొంత నిర్ణయంతో ఒప్పందం జరిగిపోయిందని తెలిపింది. ఆనాటి జాయింట్ సెక్రటరీ అభ్యంతరాలకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కాగ్ వద్ద ఉంది. ప్రస్తుతం కాగ్ ఆ ఫైలులోని అంశాలను స్టడీ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాగ్ దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు అధికారి అభ్యంతరాలు ఎలా విస్మరించబడ్డాయో కూడా వివరణ ఇవ్వనుంది కాగ్.
Recommended Video


126 రాఫెల్ విమానాల ధర కంటే 32 విమానాల ధరే ఎక్కువ
ఒప్పంద చర్చల కమిటీకి ఇండియన్ ఎయిర్ఫోర్స్ డిప్యూటీ ఛీఫ్ నేతృత్వం వహించారు. దాదాపు డజను సార్లకుపైగా చర్చలు జరిపిన తర్వాత ఫ్రెంచ్ అధికారులతో రాఫెల్ కొనుగోలు ధరపై ఒక నిర్ణయానికి వచ్చి ఒప్పందం చేసుకున్నారు. అంతకుముందు జాయింట్ సెక్రటరీగా ఉన్న రక్షణశాఖ అధికారి బెంచ్ మార్క్ ధరపై అభ్యంతరం తెలిపారు. 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కంటే 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ధరనే ఎక్కువగా ఎలా ఉంటుందని అభ్యంతరం తెలిపారు. మరోవైపు జర్మనీ కూడా యుద్ధవిమానాల కొనుగోలులో 20శాతం తగ్గిస్తామని కూడా చెప్పింది. జర్మనీ డిస్కౌంట్ ఇస్తామని ముందుకొస్తుంది కాబట్టి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అదే డిస్కౌంట్ ఇవ్వాలని భారత ప్రభుత్వం ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్ను కోరింది.

రాఫెల్ కొనుగోలుకు హడావుడిగా కేంద్రం కేబినెట్ ఆమోదం
అయితే ఆనాటి జాయింట్ సెక్రటరీ పదవీకాలం ముగిశాక కొత్తగా వచ్చిన జాయింట్ సెక్రటరీతో కేబినెట్ నోట్ తయారు చేయించి 2016 సెప్టెంబర్ మూడో వారంలో హడావుడిగా కేబినెట్ ఆమోదం తెలిపేవరకు వెళ్లింది. అయితే ఫ్రెంచ్ వెబ్సైట్ ప్రకారం ముందుగా 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత సర్కార్ ఆసక్తి చూపిందని ఆ తర్వాత 2014లో ప్రభుత్వం మారిన తర్వాత కొనుగోలు సంఖ్యను 36 యుద్ధ విమానాలకే పరిమితం చేసినట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వివరణ ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఉత్పత్తి ఫ్రాన్స్లోనే జరుగుతుంది కాబట్టి ఒక రకంగా పెద్ద డీల్ను కోల్పోయామనే బాధ ఉన్నప్పటికీ ఉత్పత్తి ఫ్రాన్స్లోనే జరుగుతుందనే విషయం ఆనందం కలిగించిందని హోలాండే చెప్పినట్లు వెబ్సైట్ వెల్లడించింది.

దసాల్ట్ కంపెనీదే నిర్ణయం
అంతేకాదు ఆఫ్సెట్ పార్ట్నర్గా రిలయన్స్ డిఫెన్స్ సంస్థ పేరును ప్రతిపాదించి మోడీ సర్కార్ తమకు మరో డిఫెన్స్ కంపెనీ ఎంచుకునే వెసులుబాటు లేకుండా చేసిందని హోలాండే చెప్పినట్లు వెబ్సైట్ వెల్లడించింది. అయితే హోలాండే చెప్పిన మాటల్లో వాస్తవం లేదని... మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్ను ఆఫ్సెట్ పార్ట్నర్గా నియమించుకోవాలన్న నిర్ణయం దసాల్ట్ కంపెనీదే అని ఆ సంస్థ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ క్లారిటీ ఇచ్చారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications