టికెట్ తీసుకోలేదని రైల్లో లేడీపై రెండు సార్లు రేప్
ఘజియాబాద్: టికెట్ తీసుకోలేదనే కారణంతో ఓ 20 మహిళా ప్రయాణికురాలిపై రైల్వే టికెట్ కలెక్టర్ (టిసి) అత్యాచారానికి పాల్పడ్డాడు. బరేలీ నుంచి జైపూర్ వెళ్తున్న రైల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టిసిని ఘజియాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - ఆమె మే 29న బరేలీ అలా హజ్రత్ ఎక్స్ప్రెస్ ఎక్కి జైపూర్లోని తన భర్ద వద్దకు బయలురేదింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇంట్లో చెప్పకుండా బయటికొచ్చిన ఆ మహిళ వద్ద డబ్బులు లేకపోవడంతో టికెట్ కొనలేదు.

దాంతో హపూర్ ప్రాంతంలో చెకింగ్కు వచ్చిన టిసి రవి మీనా ఆమెను టికెట్ అడిగాడు. టికెట్ లేదని చెప్పడంతో ఆ టీసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే మే 30న జైపూర్ చేరుకున్న ఆ మహిళ టిసపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జనరల్ కంపార్టుమెంటులో ఎక్కిన ఆ మహిళను టిసి ఎసి సెకండ్ కంపార్టుమెంటులోకి తీసుకుని వెళ్లి తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది.దీంతో విచారణ చేపట్టిన రైల్వే అధికారులు రవి మీనా అనే ఆ టిసిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications