టీఎంసీకి షాక్: బీజేపీలో చేరిన ఐదుగురు నేతలు, ఆహ్వానించిన అమిత్ షా..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. టీఎంసీ- బీజేపీ పోటాపోటీగా అడుగులు వేస్తున్నాయి. బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారం చేపడుతామనే ధీమాలో టీఎంసీ ఉండగా.. ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని కమల దళం అనుకుంటోంది. ఈ క్రమంలోనే మాటల యుద్ధం/ వరస పర్యటనలు జరుగుతున్నాయి.

టీఎంసీ పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన రెబల్స్కు బీజేపీ వెల్ కం చెప్పింది. వారు ఇవాళ హోం మంత్రి అమిత్ షాతో సుధీర్ఘ చర్చలు జరిపారు. తర్వాత అమిత్ షా నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజీవ్ బెనర్జీ, బైషాలీ దాల్మియా, ప్రబీర్ గోషాల్, రతిన్ చక్రవర్తి, రుద్రనిల్ ఘోష్ టీఎంసీకి బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు. వీరి చేరికతో బీజేపీ బలం మరింత పెరిగిందని ఆయన చెప్పారు. బెంగాల్ బంగారం మార్చేందుకు ఇది ఉపయోగపడుతోందని ట్వీట్ చేశారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో రాజీబ్ బెనర్జీ ఇదివరకు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. రాజీబ్ సహా ప్రబీర్, బైషాలీని ఇటీవల పార్టీ నుంచి టీఎంసీ బహిష్కరించింది. రతిన్ చక్రవర్తి మాజీ హౌరా మేయర్ అనే సంగతి తెలిసిందే. దీంతో వీరంతా కలిసి ఢిల్లీ వచ్చి.. సీనియర్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరితో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, యాక్టర్ రుద్రాణి ఘోష్ కూడా ఉన్నారు. వీరిని బీజేపీ ఉపాధ్యక్షులు ముకుల్ రాయ్, జాతీయ కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ ఢిల్లీ తీసుకొచ్చారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications