రెండు నెలల్లోనే అత్యాచార కేసుల విచారణ పూర్తి చేయాలి... సీఎంలు, సీజేలకు కేంద్రం లేఖలు
తెలంగాణలో దిశ, యూపీలో ఉన్నావో బాధితురాలి హత్య సంఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పలు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి. ఈనేపథ్యంలోనే కేంద్రం సైతం మహిళలపై అత్యాచారాలతో పాటు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఈ కేసులన్నింటీని కేవలం ఆరు నెలల్లోనే విచారణ ముగిసి శిక్షలు పడేలా ... చర్యలు తీసుకుకోవాలని దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాసింది.
మహిళలపై అత్యాచారాలతో పాటు ,చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్రం చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల్లో నిందితులకు శిక్షలు పడడంలో ఆలస్యం అవుతుండడంతో ప్రజలు తక్షణ న్యాయాన్ని కోరుకుంటున్నారు. ఒక్కో కేసుకు సంబంధించి సంవత్సరాల తరబడి విచారణ పేరుతో నిందితులు స్వేచ్చగా తిరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

దీంతో కేంద్ర వైఖరిపై పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రజలు, మేధావులు నిరసన వ్యక్తం చేశారు. దిశ సంఘటనతో కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ప్రధానికి విజ్ఝప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా నిందితులకు శిక్షలు అమలు కాకపోవడం పై ఆయన ప్రశ్నించారు.
ఇక నేరుగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఏకంగా రాష్ట్రపతి కూడ స్పందించారు. దీంతో పోక్సో చట్టంలో శిక్షపడ్డ ఖైదీలకు క్షమాబిక్ష పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇదే అంశంపై పార్లమెంట్లో సైతం చర్చించి పున : సమీక్ష చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం సైతం స్పందించింది.
అత్యాచారా కేసుల్లో ఆరునెలల్లోగా నిందితులకు శిక్షలు పడెలా చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఈ తరహా కేసులన్నింటిలో విచారణను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆదేశించారు. కాగా ఆరునెలల్లో శిక్షలు అమలు అయ్యోలా చర్యలు చెపట్టాలని న్యాయమూర్తులను కోరారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications