Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవీన్ పట్నాయక్‌తో మమతా బెనర్జీ భేటీ: మీడియాతో ఏం చెప్పారంటే.?

భువనేశ్వర్: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలో ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశా పర్యటనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం, బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు.

2024లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మమత బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమికి నవీన్ పట్నాయక్ మద్దతు కోరినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై ఇద్దరు సీఎంలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

 Resolved To Make Federal Structure Of Country Strong: After meeting, Mamata and Odisha CM Patnaik

భేటీ అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై ఇరువురం చర్చించామన్నారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అన్నారు. రాజకీయపరమైన అంశాల గురించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని నవీన్ పట్నాయక్ వెల్లడించారు.

ఈ భేటీ కేవలం సాధారణ బేటీ మాత్రమేనని.. దీని వెనుక ఎలాంటి రాజకీయ పరమైన ఉద్దేశాలు లేవని మమతా బెనర్జీ కూడా స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కొత్త ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా సమదూరం పాటించాలని నిర్ణయించారు. అంతేగాక, రాహుల్ గాంధీపై మమతా నేరుగా విమర్శలు చేశారు. బీజేపీ గెలుపునకు రాహుల్ గాంధీనే సహకరిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. కాగా, కొత్త ఫ్రంట్ గురించి చర్చించేందుకు శుక్రవారం మమతతో జేడీయూ నేత కుమారస్వామి కోల్‌కతాలో సమావేశం కానున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+